Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొ బాక్సర్ విజేందర్ సింగ్
న్యూఢిల్లీ : ఒలింపిక్స్లో భారత్కు తొలి బాక్సింగ్ పతకం అందించిన విజేందర్ సింగ్ నాలుగేండ్లుగా ప్రొఫెషనల్ బాక్సర్తో అద్భుత విజయాలు సాధిస్తున్నాడు. ప్రస్తుతం డబ్లూబీఓ ఆసియా పసిఫిక్, ఒరియెంటల్ మిడిల్ వెయిట్ చాంపియన్గా కొనసాగుతున్నాడు. 2017 డిసెంబర్ నుంచి రింగ్లోకి దిగని విజేందర్ సింగ్, ఈ ఏడాది అమెరికాలో తొలి విజయంపై గురి పెట్టాడు. దిగ్గజ బాక్సర్ మహ్మద్ అలీ గడ్డపై తనదైన జాబ్స్, పంచ్లతో టైటిల్ విజయం సాధించాలని విజేందర్ ఉవ్విళ్లూరుతున్నాడు. గతేడాది జులైలో విజేందర్ ప్రత్యర్థి లీ మార్కమ్ ఫిట్నెస్ కారణాలతో పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో కామన్వెల్త్ సూపర్ మిడిల్వెయిట్ టైటిల్ ఫైట్ చోటు చేసుకోలేదు. ప్రొ బాక్సర్గా 10-0 రికార్డును ఆస్వాదిస్తున్న విజేందర్ సింగ్ 50-0 లక్ష్యంగా శ్రమిస్తున్నానని తెలిపాడు. 'అమెరికాలో ఫైట్ కోసం త్వరలోనే అక్కడికి వెళ్తున్నాను. ముందుగా ట్రైనింగ్ కోసం నా బృందంతో లాస్ ఏంజిల్స్ చేరుకోవాల్సి ఉన్నది. ప్రొ కెరీర్లో 10-0తో కొనసాగుతున్నాను. ఏదో ఒక రోజు ఈ రికార్డును 50-0గా చూడాలని నా ధ్యేయం' అని విజేందర్ సింగ్ పేర్కొన్నాడు. -