Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రమసంఖ్య తేదీ తలపడే జట్లు సమయం వేదిక
1. మార్చి-23 చెన్నై × బెంగళూరు సాయంత్రం చెన్నై
2. మార్చి-24 కోల్కతా × సన్రైజర్స్ మధ్యాహ్నం కోల్కతా
ముంబయి × ఢిల్లీ సాయంత్రం ముంబయి
3. మార్చి-25 రాజస్తాన్ × పంజాబ్ సాయంత్రం జైపూర్
4. మార్చి-26 ఢిల్లీ × చెన్నై సాయంత్రం ఢిల్లీ
5. మార్చి-27 కోల్కతా × పంజాబ్ సాయంత్రం కోల్కతా
6. మార్చి-28 బెంగళూరు × ముంబయి సాయంత్రం బెంగళూరు
7. మార్చి-29 సన్రైజర్స్ × రాజస్తాన్ సాయంత్రం హైదరాబాద్
8. మార్చి-30 పంజాబ్ × ముంబయి మధ్యాహ్నం మొహాలి
ఢిల్లీ × కోల్కతా సాయంత్రం ఢిల్లీ
9. మార్చి-31 సన్రైజర్స్ × బెంగళూరు మధ్యాహ్నం హైదరాబాద్
చెన్నై × రాజస్తాన్ సాయంత్రం చెన్నై
10. ఏప్రిల్-1 పంజాబ్ × ఢిల్లీ మధ్యాహ్నం మొహాలీ
11. ఏప్రిల్-2 రాజస్తాన్ × బెంగళూరు సాయంత్రం జైపూర్
12. ఏప్రిల్-3 ముంబయి × చెన్నై సాయంత్రం ముంబయి
13. ఏప్రిల్-4 ఢిల్లీ × సన్రైజర్స్ సాయంత్రం ఢిల్లీ
14. ఏప్రిల్-5 బెంగళూరు × కోల్కతా సాయంత్రం బెంగళూరు
న్యూఢిలీ: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) గవర్నింగ్ బాడీ మంగళవారం సమావేశమై..రెండు వారాల షెడ్యూల్ను ఖరారు చేసింది. టోర్నమెంట్లో తొలి మ్యాచ్ మార్చి 23న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్నది. మొదటి విడతగా టోర్నమెంటు రెండు వారాల షెడ్యూల్లో 17 మ్యాచులు జరగనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు మహేంద్రసింగ్ ధోనీ చేతిలో ఉంటే..రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లి కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
టోర్నమెంట్లో ఎనిమిది టీములు.
1. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
2.చెన్నై సూపర్ కింగ్స్,
3.సన్రైజర్స్ హైదరాబాద్
4.ఢిల్లీ క్యాపిటల్స్
5.ముంబయి ఇండియన్స్
6.కోల్కతా నైట్రైడర్స్
7.రాజస్థాన్ రాయల్స్
8.కింగ్స్ ఎలెవన్ పంజాబ్
..తొలి విడత జరిగే రెండు వారాల షెడ్యూల్లో ప్రతి టీమ్ కనీసం నాలుగు మ్యాచులు ఆడనుననది. ఢిల్లీ క్యాపిటల్స్,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం చేరో ఐదు మ్యాచ్లు ఆడనున్నాయి. ప్రతి టీమ్ లోకల్ గ్రౌండ్లలో రెండు సార్లు ప్రత్యర్థి టీమ్లపై ఆడే విధంగా ఏర్పాటు చేశారు.
లోక్సభ ఎన్నికల తర్వాతే..
ఐపీఎల్ గవర్నింగ్ బాడీ భేటీలో లోక్సభ ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఎన్నికల షెడ్యూల్డ్ విడుదలయ్యాక..ఇప్పటికే ప్రకటించిన తొలి షెడ్యూల్లో అవసరమై మార్పులు ఉంటే ఆ వివరాలను ప్రకటించాలని సమావేశం నిర్ణయించింది.