Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యవర్తిగా పిఎస్ నరసింహ నియామకం
- బీసీసీఐ కేసులో సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో ఆపరిష్కతంగా మిగిలిన వివాదాలను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు గురువారం ఓ అడుగు ముందుకేసింది. కోర్టు సహాయకారి పిఎస్ నరసింహను మధ్యవర్తిగా నియమించింది. ' పిఎస్ నరసింహను మధ్య వర్తిగా నియమిస్తున్నాం. రాష్ట్ర సంఘాలు ఏదైనా అభ్యంతరాలను ఆయనతో చెప్పవచ్చు. నరసింహ వాటిని పాలకుల కమిటీకి నివేదిస్తారు. మధ్యవర్తితో సంతృప్తి చెందని పక్షంలో అప్పుడు కోర్టు నేరుగా విచారణ చేపడు తుంది' అని జస్టిస్ ఎస్ఏ బోబ్డె జస్టిస్ ఏఎం సప్రెలతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. ' రాష్ట్ర సంఘాల వాదనలు వినాలని నరసింహను కోరుతున్నాం. వాటిని పరిష్క రించాల్సిందిగా ఆయన బీసీసీఐని కోరతారు. ఏది ఏమైనా ఆట కచ్చితంగా ముందుకు సాగాల్సిందే' అని ధర్మాసనం తెలిపింది. మధ్యవర్తిగా వ్యవహరించినందుకు బీసీసీఐ నరసింహకు ఫీజును ఇవ్వాల్సిందిగా ధర్మాసనం ఆదేశిం చగా..నరసింహ అందుకు నిరాకరించారు. కానీ ఈ రోజులో ఫీజు తీసుకోకుండా పని చేస్తే ప్రజలు ఏదో జరుగుతుందనే అనుమానం వ్యక్తం పరిస్థితి ఉన్నందున ఆయనకు కచ్చితంగా ఫీజు ఇవ్వాల్సిందేనని ధర్మాసనం తెలిపింది.