Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండియా ఓపెన్ సీడింగ్ విడుదల
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక భారత బ్యాడ్మింటన్ టోర్నీ ఇండియా ఓపెన్లో చైనా షట్లర్లు టాప్ సీడ్ దక్కించుకున్నారు. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్షిప్ విజేత చెన్ యుఫె, ఇండియా ఓపెన్ డిఫెండింగ్ చాంపియన్ షి యుకిలకు న్యూఢిల్లీ టోర్నీలో టాప్ సీడింగ్ లభించింది. మార్చి 26 నుంచి ఆరంభం కానున్న టోర్నీకి శుక్రవారం సీడింగ్ కేటాయించారు. ఈసారి చైనా నుంచి 12 మంది టాప్ షట్లర్లు ఇండియా ఓపెన్కు రానున్నారు. వరల్డ్ నం.7 హీ బింగ్జియావ్కు మూడో సీడ్ సాధించగా, వరల్డ్ నం.14 హన్ యు ఏడో సీడ్ దక్కించుకున్నది. భారత అగ్రశ్రేణి షట్లర్, మాజీ చాంపియన్ పి.వి సింధుకు రెండో సీడ్ దక్కగా, సీనియర్ షట్లర్ రెండు సార్లు విజేత సైనా నెహ్వాల్కు ఐదో సీడ్ లభించింది. మెన్స్ సింగిల్స్లో షి యుకి టాప్ సీడ్ సాధించగా.. విక్టర్ అక్సెల్సన్ రెండో సీడ్, భారత స్టార్ కిదాంబి శ్రీకాంత్ మూడో సీడ్ దక్కించుకున్నారు. ఆరోగ్య సమస్యలతో ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్షిప్స్లో ఇబ్బంది పడిన సైనా నెహ్వాల్, స్విస్ ఓపెన్ నుంచి ఉపసంహరించుకున్నది. ఇండియా ఓపెన్ సమయానికి మ్యాచ్ ఫిట్నెస్ సాధించి సత్తా చాటాలని ఎదురు చూస్తున్నది.