Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సారు గోపీచంద్ అకాడమీలో సాధన
హైదరాబాద్ : బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పి.వి సింధు మనసు మార్చుకున్నది. సహచర షట్లర్లతో పాటే కలిసి సాధన చేసేందుకు సిద్దమైంది. సింగిల్స్ స్టార్స్ సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్లు సారు గోపీచంద్ అకాడమీలో సాధన చేస్తున్నారు. సింధు ఆ అకాడమీలో కాకుండా పుల్లెల గోపీచంద్ అకాడమీలో (సొంత అకాడమీ) శిక్షణ తీసుకుంటోంది. నిరుడు జులైలో సింధు చేసిన అభ్యర్థన మేరకు గోపీచంద్కు ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. కానీ అంతర్జాతీయ సర్క్యూట్లో వరుస వైఫల్యాల తర్వాత మనసు మార్చుకున్న సింధు.. మళ్లీ సైనా, శ్రీకాంత్లతో కలిసి ఒకే అకాడమీలో సాధన చేసేందుకు అంగీకరించింది. ఇండియా ఓపెన్కు ముందు సింధు ఇప్పటికే సారు గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. సారు నియమించిన ప్రత్యేక సింగిల్స్ కోచ్లు ఇక్కడే ఉండటం సింధుకు కలిసొచ్చే అంశం.