Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దిగ్గజ మహిళా బాక్సర్ ఎం.సీ మేరికోమ్ ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్స్ నుంచి తప్పుకున్నది. ఈ ఏడాది చివర్లో జరుగనున్న ప్రపంచ చాంపియన్షిప్స్ కోసం సిద్ధమవుతోన్న మేరీకోమ్.. ఆసియాలో పంచ్ విసరటం లేదు. తెలంగాణ యువ బాక్సర్, మాజీ ప్రపంచ జూనియర్ చాంపియన్ నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో పాల్గొననున్నది. న్యూఢిల్లీలోని ఇంధిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన ట్రయల్స్ ఆధారంగా 20 బాక్సర్లను ఎంపిక చేశారు. మేరీకోమ్ లేని వేళ వరల్డ్ చాంపియన్షిప్స్ సిల్వర్ మెడలిస్ట్ సోనియా చాహల్ భారత బృందానికి సారథ్యం వహించనున్నది. సీమ పూనియా, పూజ రాణి, నుపుర్, లవ్లినా, సిమ్రన్జిత్ కౌర్, మనీశా, నితూలు ఆసియాలో పంచ్ విసరనున్నారు.