Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆటపై శ్రద్ధ చూపని కారణంగానే ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే వెనక్కి పంపించారనే మాట గాలి వార్తలేనని యువ క్రికెటర్ పృథ్వీ షా అన్నాడు. ' అవన్నీ పుకార్లు. వాటిని అలాగే వదిలేయాలి. కఠినంగా శ్రమించాలని ఎవరూ నాతో మాట్లాడలేదు. ఆసీస్లో ఆడాలని అనుకున్నా, కానీ గాయంతో కుదరలేదు. మెల్బోర్న్ టెస్టుకు అందుబాటులో ఉంటానని ఆశించాను. కానీ మోకాలి గాయం అంత త్వరగా నయం కాదు. నెమ్మదిగా కోలుకున్నాను. నేషనల్ క్రికెట్ అకాడమీలో ఎన్నో సెషన్ల పాటు శ్రమించాను. ఫిజియోలు ఎంతగానో తోడ్పాటు అందించారు. ముస్తాక్ అలీ టీ20 టోర్నీకి సిద్దం కావాలనేది ప్రణాళిక. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఆడేటప్పుడు మార్చుకోవాల్సినది మానసిక దృక్పథమేనని' పృథ్వీ షా పేర్కొన్నాడు.