Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ పూర్తి స్థాయి షెడ్యూల్ సోమవారం విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలున్నా, పూర్తి సీజన్ను స్వదేశంలోనే నిర్వహించేందుకు బీసీసీఐ పాలకుల కమిటీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు బీసీసీఐ 17 మ్యాచులకు షెడ్యూల్ విడుదల చేసింది. అన్ని జట్లూ నాల్గు మ్యాచులు ఆడనుండగా, ఢిల్లీ, బెంగళూర్లు ఐదేసి మ్యాచులు ఆడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ తర్వాత కసరత్తు చేసిన ఐపీఎల్ సీఓఓ షెడ్యూల్ను సీఓఏకు అందజేయనున్నాడు. సోమవారం ముంబయిలోని ఓ హౌటల్లో పాలకుల కమిటీ సమావేశం కానున్నది. ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్తో సైతం వినోద్ రారు కమిటీ భేటీ కానున్నది. సీఓఏ సమావేశంలో షెడ్యూల్కు ఆమోదం తెలిపితే, సోమవారమే పూర్తి షెడ్యూల్ విడుదల చేయనున్నారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 వరకు తొలి దశలో షెడ్యూల్ ప్రకటించారు.