Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఆదుకునేందుకు బీసీసీఐ భూరీ విరాళం ఇవ్వనున్నది. రూ. 5 కోట్ల విరాళం ప్రకటించాలని తాత్కాలిక అధ్యక్షుడు సికె ఖన్నా తొలుత సీఓఏను కోరాడు. ఐపీఎల్ 12 ఆరంభ వేడుకల బడ్జెట్ మొత్తం విరాళం ఇస్తామని ఇటీవల బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. ' మార్చి 23న చెన్నైలో సూపర్కింగ్స్, రాయల్ చాలెంజర్స్ మ్యాచ్కు సీనియర్ ఆర్మీ, నేవీ, వైమానిక దళ అధికారులను ఆహ్వానిస్తున్నారు. సీఓఏ రూ. 20 కోట్లు మంజూరు చేసింది. తొలి మ్యాచ్కు ముందు ధోని, కోహ్లిలు ఈ మొత్తాన్ని ఆర్మీ వెల్ఫేర్ ఫండ్, నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళంగా అందజేయనున్నారు' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. నిజానికి ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో గత సీజన్ ఫైనలిస్ట్లు తలపడతారు. కానీ సన్రైజర్స్ స్థానంలో ఈసారి రాయల్ చాలెంజర్స్ ఆరంభ మ్యాచ్లో ఆడుతోంది. జవాన్లకు భారీ విరాళం అందజేయనున్న మ్యాచ్ కావటంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఉండాలని భావించి, బెంగళూర్ను తొలి మ్యాచ్ ఆడిస్తున్నారు!.