Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంకపై 5-0తో గెలుపు
- సాఫ్ చాంపియన్షిప్
బిరాట్నగర్ (నేపాల్) : భారత మహిళల ఫుట్బాల్ జట్టు శ్రీలంకను చిత్తు చేసింది. లంక గోల్పోస్ట్పై వరుస దాడులతో గోల్స్ వర్షం కురిపించింది. 5-0తో ఏకపక్ష విజయం సాధించి సాఫ్ చాంపియన్షిప్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. నేపాల్లోని బిరాట్నగర్లో జరుగుతున్న దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్ చాంపియన్షిప్స్లో టైటిల్ దిశగా టీమ్ ఇండియా అమ్మాయిలు ఓ అడుగు మందుకేశారు. ఈ విజయంతో గ్రూప్-బిలో అగ్రస్థానం సాధించిన భారత్, టోర్నీ చరిత్రలో వరుసగా 21 మ్యాచుల్లో అజేయ రికార్డును కొనసాగించింది. సెమీఫైనల్లో గ్రూప్-ఏ రన్నరప్ బంగ్లాదేశ్తో భారత్ తలపడనున్నది. బుధవారం జరిగే సెమీ సమరంలో టీమ్ ఇండియా ఫేవరెట్గా బరిలోకి దిగనున్నది. మరో సెమీస్లో ఆతిథ్య నేపాల్తో శ్రీలంక ఆడనున్నది. నాలుగు సార్లు విజేత భారత్ తరఫున గ్రేస్, సంగీత, జబమణి, దాలిమా చిబ్బర్లు గోల్స్ నమోదు చేశారు.