Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా)తో ఆరు నెలల పాటు పని చేసేందుకు బీసీసీఐ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఐసీసీ, వాడా ఒప్పందం చేసుకున్నా.. నాడాకు ఆటగాళ్ల శాంపిళ్ల సేకరణ బాధ్యత ఇచ్చేం దుకు బీసీసీఐ అంగీకరించలేదు. నాడా లాబోరేట రిలో ఇటీవల వెల్లడైన కొన్ని ఫలితాలు బీసీసీఐ వాదనకు మరింత చేకూర్చాయి. సోమవారం ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్తో భేటి అయిన పాలకుల కమిటీ ఈ మేరకు అంగీకరించినట్టు సమాచారం. ఈ ఆరు నెలల కాలంలో నాడా పని తీరుపై సంతృప్తి చెందనపక్షంలో, ఒప్పందాన్ని పునరుద్ధంచమని బీసీసీఐ పేర్కొన్నట్టు తెలిసింది. దీనిపై నాడా డైరెక్టర్ స్పందించేందుకు నిరాకరించారు. 2016 టీ20 ప్రపంచకప్కు పన్ను మినహాయింపు కింద దక్కాల్సిన రూ. 150 కోట్లపై మనోహర్ చర్చించగా, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీసీఐ ఈ సంగతి చూస్తుందని చెప్పినట్టు తెలిసింది. 2021, 2023 ఐసీసీ టోర్నీలకు పన్ను మినహాయింపుపై సైతం అప్పుడే స్పష్టత వస్తుందని బీసీసీఐ వెల్లడించింది. రూ. 11 కోట్లు చెల్లించిన పాక్ బోర్డు : బీసీసీఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక సిరీస్లు ఆడేందుకు భారత బోర్డు నిరాకరించిందని, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) లీగల్ ఫైట్ చేసిన సంగతి తెలిసిందే. ఒప్పందం పరస్పర అంగీకారమే కానీ, న్యాయ బద్దం కాదని చెప్పిన బీసీసీఐ వాదనను ఐసీసీ కమిటీ అంగీకరించింది. కేసు ఓడిన పీసీబీ న్యాయ ఖర్చుల కింద భారత్కు రూ. 11 కోట్లు చెల్లించింది. ఈ మేరకు పీసీబీ చైర్మన్ ఈషన్ మణి తెలిపారు.