Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్ చేతిలో ఓటమిపై ద్రవిడ్
ముంబయి : 2019 ప్రపంచకప్లో టీమ్ ఇండియా హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగి, అలవోకగా టైటిల్ సాధిస్తుందనే నమ్మకం ఎక్కువగా వినిపించింది. అలాంటి పరిస్థితుల్లో 2-0తో ముందంజలో నిలిచినా 2-3తో ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్ ఓటమి భారత్కు మేలే చేసిందని మాజీ కెప్టెన్, భారత్-ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. ' గత కొన్నేండ్లుగా వన్డే క్రికెట్ను శాసిస్తున్నాం, ప్రపంచ అగ్రశ్రేణి జట్టుగా ఎదిగాం, అందుకే అలవోకగా వరల్డ్కప్ సాధిస్తామనే దీమాలో ఉండగా, ఈ ఓటమి మంచిదే. ప్రపంచకప్లో ఎంతో ఎంతో బాగా ఆడాలని ఈ ఓటమి గుర్తు చేసింది. ఈ ఓటమి వరల్డ్కప్కు ముందు హెచ్చరిక సంకేతంగా ఉపయోగపడుతుంది. ప్రపంచకప్లో భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది' అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. ' ఐపీఎల్లో భారత వరల్డ్కప్ ప్రణాళికలోని ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ కోరకూడదు. ఐపీఎల్ పూర్తిగా వ్యాపార విపణీ. విశ్రాంతిపై ప్రాంఛైజీలకే తుది నిర్ణయాన్ని వదిలేయాలి' అని ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంజరు మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు.