Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్ పేస్ దిగ్గజం మెక్గ్రాత్
చెన్నై : భారత పేస్ దళం బలహీనత లేనిదని ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం గ్లెన్ మెక్గ్రాత్ పేర్కొన్నాడు. ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ డైరెక్టర్గా వ్యహరిస్తోన్న మెక్ గ్రాత్ కెరీర్లో మూడు సార్లు ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడు. ' ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో భారత పేస్ విభాగంలో ఎటువంటి లోపం చూడలేదు. భారత్ది నమ్మశక్యం కాని బౌలింగ్ బృందం. బౌలర్లను ఫిట్గా నిలు పుకోవటమే భారత్ ముందున్న సవాల్. బుమ్రాకు నేను పెద్ద అభిమానిని. ప్రపంచకప్లో బుమ్రా, భువనేశ్వర్లకు భారత్కు అత్యంత కీలకం. భువనేశ్వర్ ఆలోచనతో బంతులేస్తాడు. స్వింగ్ బౌలర్గా అతడు రాణించాల్సి ఉంటుంది. వన్డేల్లో ప్రత్యేకించి డెత్ ఓవర్లలో బుమ్రా యార్కర్లు అతడిని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి' అని మెక్ గ్రాత్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లి కెరీర్ ముగిసే సమయానికి దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా సరసన నిలబడతాడని మెక్గ్రాత్ అన్నా డు. ఇక ప్రపంచకప్కు ముందు ఐపీఎల్ ఆడటంపై ఎంతో చర్చ నడుస్తోంది. భారత్, ఇంగ్లాండ్ భిన్న పరిస్థితుల పిచ్లు. ఐపీఎల్ లో ఆడటంతో మెగా ఈవెంట్కు ముందు ఆత్మవిశ్వాసం వస్తుంది. భారీ ఇన్నింగ్స్లు, వికెట్ల వేట ఆటగాళ్లను రాటుదేల్చుతాయి!. వర్క్ లోడ్పైనా మాట్లాడుతున్నారు. ఐపీఎల్లో ఓ బౌలర్ గరిష్టంగా నాలుగు ఓవర్లు వేస్తాడు. ఆ తర్వాత ప్రయాణ బడలిక. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటే సరిపోతుందని మెక్గ్రాత్ పేర్కొన్నాడు.