Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నై సూపర్ కింగ్స్ విరాళం
చెన్నై : ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ టికెట్ల సొమ్ము మొత్తాన్ని పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు సాయంగా ఇవ్వనున్నది. మార్చి 23న చెన్నై, బెంగళూర్లో ఆరంభ మ్యాచ్లో తలపడనున్నాయి. ఆరంభ వేడుకల బడ్జెట్ మొత్తం రూ. 20 కోట్లను నేషనల్ డిఫెన్స్ ఫండ్కు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆరంభ మ్యాచ్కు ముందు ఎం.ఎస్ ధోని ఆర్మీ అధికారులకు టికెట్ల సొమ్ము మొత్తం చెక్ను అందజేయనున్నాడు.