Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2-0తో హాకీ ఇండియా గెలుపు
- అజ్లాన్షా హాకీ టోర్నీ
ఇఫో (మలేషియా) : ఆసియా గేమ్స్ హాకీ విజేత జపాన్ను హాకీ ఇండియా చిత్తు చేసింది. అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ తొలి మ్యాచ్లోనే జపాన్పై స్ఫూర్తిదాయక విజయం నమోదు చేసింది. సీనియర్ ఆటగాళ్లు గాయాలతో టోర్నీకి దూరమైనా, యువ జట్టు మెరుగైన ప్రదర్శన చేసింది. 24వ నిమిషంలో వరుణ్ కుమార్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి భారత్ ఖాతా తెరిచాడు. చివరి క్వార్టర్ 55వ నిమిషంలో డైవ్ చేస్తూ కండ్లుచె దిరే ఫీల్డ్ గోల్ చేసిన సిమ్రన్జిత్ సింగ్ భారత్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. జపాన్పై విజయంతో భారత్ మూడు పాయింట్లు సొంతం చేసుకున్నది. గ్రూప్ దశలో తర్వాతి మ్యాచ్లో ఆదివారం కొరియాతో తలపడనున్నది. ఇదే గ్రూప్లోని మలేషియా, కెనడా, పొలాండ్లతోనూ హాకీ ఇండియా పోటీపడాల్సి ఉంటుంది.