Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలు సహా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భూరీ విరాళం అందజేసింది. ముందుగా ప్రకటించినట్టు, ఐపీఎల్ ఆరంభ వేడుకల బడ్జెట్ రూ. 20 కోట్లను నేషనల్ డిఫెన్స్ ఫండ్కు అందించింది. రూ. 11 కోట్లను ఆర్మీకి, రూ. 7 కోట్లను సీఆర్పీఎఫ్కు, నేవీ-ఎయిర్ఫోర్స్లకు రూ. కోటి చొప్పున బీసీసీఐ చెక్కులు అందజేసింది. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ టికెట్ల సొమ్ము రూ. 2 కోట్లను చెన్నై సూపర్ కింగ్స్ సైతం విరాళంగా అందించింది. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ కుటుంబ సభ్యుడికి ధోని రూ. 2 కోట్ల చెక్కును అందించాడు. ' ఎప్పట్లాగ ఐపీఎల్ ఆరంభ వేడుకలు నిర్వహించవద్దని సమాఖ్యగా బీసీసీఐ భావించింది. అందరి మనసులకు దగ్గరగా ఉండేందుకు, ఆరంభ వేడుకల ఖర్చు మొత్తం జవాన్లకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాం' అని పాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రారు ఓ ప్రకటనలో తెలిపారు.