Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28 బంతుల్లో 62 పరుగులు
- దినేశ్ కార్తీక్ అర్ధ సెంచరీ
న్యూఢిల్లీ : అండ్రూ రస్సెల్ (62, 28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లు)ను అడ్డుకునేందుకు ఐపీఎల్ జట్లు కొత్త వ్యూహలు అన్వేషించాలి!. విండీస్ వీరుడి విధ్వంసక ఇన్నింగ్స్కు మరో జట్టు బలైంది. 9.1 ఓవర్లలో కోల్కత నైట్రైడర్స్ను 61/5తో నిలువరించిన ఢిల్లీ క్యాపిటల్స్.. రాబోయే రస్సెల్ విధ్వంసాన్ని ఊహించి ఉండకపోవచ్చు!. తొలి పది ఓవర్లలో పేలవ ప్రదర్శనతో కనీసం వంద పరుగులైనా చేయగలదా? అనే స్థితి నుంచి కోల్కత భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (50, 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు) తోడుగా ఏడో వికెట్కు 95 పరుగులు జోడించిన రస్సెల్ ఢిల్లీ బౌలర్ల గణాంకాలను తారుమారు చేశాడు. రస్సెల్ వీరంగంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కత నైట్రైడర్స్ 185 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో హర్షల్ పటేల్ (2/40) రాణించాడు.
విలవిల.. విధ్వంసం : కోల్కత ఇన్నింగ్స్ తొలి పది ఓవర్లు, చివరి పది ఓవర్లు పూర్తిగా విరుద్ధంగా సాగాయి. ఢిల్లీ బౌలర్లు మెరవటంతో కోల్కత ఆరంభంలో వేగంగా వికెట్లు కోల్పోయింది. నిఖిల్ నాయక్ (7), రాబిన్ ఉతప్ప (11), నితీశ్ రాణా (1), శుభ్మన్ గిల్ (4)లు విఫలమయ్యారు. ఓపెనర్ క్రిస్ లిన్ (20) సైతం ఎంతోసేపు నిలువలేదు. దీంతో 65 పరుగులకే కోల్కత సగం వికెట్లు కోల్పోయింది. చివరి పది ఓవర్లలో అండ్రూ రస్సెల్ ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చివేశాడు. సిక్సర్ల వర్షం కురిపించిన రస్సెల్ ఓవర్కు సగటున 14-15 పరుగులు రాబట్టుకు న్నాడు. అతడికి దినేశ్ కార్తీక్ తోడయ్యాడు. వీరిద్దరూ జంటగా చెలరేగారు. 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన రస్సెల్ మరింత ప్రమాదకరంగా తయారయ్యాడు. రస్సెల్ నిష్క్రమించినా.. డెత్ ఓవర్లలో కోల్కత పరుగు వేగం తగ్గలేదు. పియూశ్ చావ్లా (12), కుల్దీప్ యాదవ్ (10) ఆకట్టుకున్నారు.