Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం స్పష్టీకరణ
న్యూఢిల్లీ : భారత్కు అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను ఇవ్వకూడదని అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలకు ఆదేశాలు జారీ చేసిన అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) తన నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది. మార్చి 28న ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం ముగిసింది. ఈ సమావేశాల సందర్భంగా భారత్ ఆతిథ్యమిచ్చే ఈవెంట్లపై ఏమైనా పునరాలోచన చేశారా? అని అడుగగా, ఐఓసీ ఎటువంటి మార్పు లేదని బదులిచ్చింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్లో జరిగిన షూటింగ్ ప్రపంచకప్లో పాల్గొనేందుకు ఇద్దరు పాకిస్థాన్ షూటర్లకు భారత్ వీసా నిరాకరించింది. దీనిపై ఆగ్రహించిన ఐఓసీ.. వరల్డ్కప్ ఒలింపిక్ కోటాను రద్దు చేసింది. భారత ఒలింపిక్ సంఘం వినతితో ఒలింపిక్ కోటాలను తిరిగి అందజేసినా.. భవిష్యత్లో అంతర్జాతీయ టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వాలంటే ప్రభుత్వం నుంచి హామీ పత్రం ఇవ్వాలని ఐఓసీ కోరుతోంది. అందరికీ సమాన అవకాశాలనే ఒలింపిక్ సంఘం ప్రాథమిక నినాదానికి షూటింగ్ ప్రపంచకప్ సందర్భంగా భారత్ తిలోదకాలు ఇచ్చిందని ఐఓసీ విశ్వసిస్తోంది.