Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షి యుకి చేతిలో ఓటమి మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్
కౌలాలంపూర్ : సమీర్ వర్మకు చుక్కెదురు. వరల్డ్ నం.2 షి యుకి చేతిలో మధ్యప్రదేశ్ కుర్రాడు ఓటమిపాలయ్యాడు. గంటకు పైగా సాగిన తొలి రౌండ్ మ్యాచ్లో సమీర్ వర్మ మూడు గేముల పాటు పోరాడాడు. 20-22, 23-21, 12-21తో సమీర్ వర్మ పోరాడి ఓడాడు. మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్ జెర్రి చొప్రా, సిక్కి రెడ్డి జంట 22-20, 24-22తో ఐర్లాండ్ జోడీపై ఉత్కంఠ మ్యాచ్లో గెలుపొంది మలేషియా ఓపెన్లో శుభారంభం చేశారు. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి 20-22, 21-17, 20-22 మూడు గేముల మ్యాచ్లో ఓటమి చెందారు.
పోరాడినా.. : పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మకు మరోసారి షి యుకి చేతిలో ఓటమి తప్పలేదు. వరల్డ్ టూర్ ఫైనల్స్ సెమీఫైనల్లో షి యుకి చేతిలో ఓడిన సమీర్ వర్మ.. మళ్లీ అతడి చేతిలోనే మలేషియా తొలి రౌండ్లో నిష్క్రమించాడు. తొలి గేమ్లో 8-8తో సమీర్ పోటిలో ఉన్నాడు. కానీ విరామం తర్వాత 11-16తో వెనుకంజలో పడిపోయాడు. 20-20తో రేసులోకి వచ్చినా గేమ్ షి యుకి సొంతమైంది. రెండో గేమ్లోనూ ఇదే కథ, కానీ ముగింపు సమీర్ ఇచ్చాడు. 11-16 నుంచి పోరాడిన సమీర్ వర్మ 20-20తో స్కోరు సమం చేశాడు. ఈ సారి గేమ్ పాయింట్ తనే కొట్టి మ్యాచ్ను నిర్ణయాత్మక గేమ్కు తీసుకెళ్లాడు. మూడో గేమ్లో షి యుకి ఏకపక్ష విజయం సాధించాడు. 9-0తో భారీ ఆధిక్యంలో నిలిచిన షి యుకి అదే జోరులో మూడో గేమ్, మ్యాచ్ను గెల్చుకున్నాడు. ఇక మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్ జెర్రీ చొప్రా జంటగా నెగ్గిన సిక్కి రెడ్డి.. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప తోడుగా నిరాశపరిచింది.
సైనా, సింధు పోరు నేడు : భారత బ్యాడ్మింటన్ అగ్ర తారలు, మహిళల సింగిల్స్ టైటిల్ ఫేవరెట్లు సైనా నెహ్వాల్, పి.వి సింధులు మలేషియా ఓపెన్ టైటిల్ వేటను నేడు మొదలు పెట్టనున్నారు. అనారోగ్యంతో స్విస్, ఇండియా ఓపెన్లకు దూరమైన సైనా నెహ్వాల్ తాజాగా మలేషియాలో పోటీపడుతోంది. థారులాండ్ షట్లర్ చుచువాంగ్ పొర్నపొవితో సైనా తొలి రౌండ్లో తలపడనున్నది. జపాన్ అమ్మాయి అయా ఒహొరితో సింధు తొలి పరీక్ష ఎదుర్కొనున్నది. పురుషుల సింగిల్స్లో ఇండియా ఓపెన్ రన్నరప్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ తొల రౌండ్లో ఇండోనేషియా ఆటగాడు ముస్తాఫతో తలపడనున్నాడు. హెచ్.ఎస్ ప్రణరు నేడు తొలి రౌండ్లో సితికోమ్తో పోరాడనున్నాడు.