Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగళూర్ 158/4
- కోహ్లి, డివిలియర్స్ విఫలం
- పార్దీవ్ పటేల్ అర్ధ సెంచరీ
జైపూర్ : ఈసారి కప్పు మనదే.. ఈసారి కప్పు మనదే అంటూ అంచనాలు భారీగా పెంచేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్.. ఎప్పట్లాగానే ఈసారి దారుణంగా విఫలమవు తోంది. హ్యాట్రిక్ ఓటములు చవిచూసిన కోహ్లి జట్టు.. రాయల్స్ చేతిలోనూ భంగపడేలా కనిపిస్తోంది. జైపూర్లో రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూర్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (23), ఏబీ డివిలియర్స్ (13) విఫలమయ్యారు. ఓపెనర్ పార్దీవ్ పటేల్ (67), మార్కస్ స్టోయినిస్ (31), మోయిన్ అలీ (18) రాణించారు. రాయల్స్ లెగ్స్పిన్నర్, కర్ణాటక కుర్రాడు శ్రేయాష్ గోపాల్ బెంగళూర్ను వణికించాడు. మూడు వికెట్లు కూల్చిన గోపాల్ బెంగళూర్ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశాడు.
ఆదుకున్న పటేల్ : టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్ ఛేదనకు మొగ్గుచూపింది. సవారు మాన్సింగ్ మైదానంలో బెంగళూర్కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి (23, 25 బంతుల్లో 3 ఫోర్లు), పార్దీవ్ పటేల్ (67, 41 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 49 పరుగులు జోడించారు. కోహ్లి మూడు ఫోర్లు కొట్టగా.. అతడిపై అంచనాలు పెరిగాయి. కానీ గోపాల్ బంతికి కోహ్లి వికెట్ కోల్పోయాడు. ఏబీ డివిలియర్స్ (13) రెండు ఫోర్లతో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఏబీని గోపాల్ రిటర్న్ క్యాచ్తో వెనక్కి పంపాడు. ప్రమాదకర్ షిమ్రోన్ హెట్మయర్ (1)ను సైతం గోపాల్ డగౌట్కు సాగనం పాడు. 73/3తో కీలక వికెట్లు కోల్పోయిన బెంగళూర్ను పార్దీవ్ పటేల్ (67, 41 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. మార్కస్ స్టోయినిస్ (31 నాటౌట్, 28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), మోయిన్ అలీ (18 నాటౌట్, 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) చివరి ఓవర్లలో వేగంగా పరుగులు సాధించారు. నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన బెంగళూర్ 158 పరుగులు చేసింది. శ్రేయాష్ గోపాల్ మూడు వికెట్లు పడగొట్టగా, జోఫ్రా ఆర్చర్ ఓ వికెట్ తీసుకున్నాడు.