Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంగూలీ వివరణ కోరిన బీసీసీఐ
ముంబయి : భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి విరుద్ధ ప్రయోజనాల అంశంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నోటీసులు జారీ చేసింది. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా కొనసాగుతూ, ఐపీఎల్ ప్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్కు సలహాదారుడుగా వ్యవహరించ టంపై వివరణ ఇవ్వాలని కోరింది. ఏప్రిల్ 7 లోగా సమాధానం ఇస్తానని బీసీసీఐ అంబుడ్స్మన్ జస్టిస్ డికె జైన్కు గంగూలీ తెలిపినట్టు సమాచారం. కోల్కతకు చెందిన రంజిత్ సీల్, బిశ్వంతి, అభిజిత్లు జస్టిస్ జైన్కు గంగూలీపై ఫిర్యాదు చేశారు. క్యాబ్ అధ్యక్షుడిగా ఉంటూ, ఏప్రిల్ 12న ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఈడెన్ గార్డెన్ మైదానంలోకి వచ్చేందుకు గంగూలీని ఎలా అనుమతిస్తారని ఫిర్యాదులో ప్రశ్నించారు. అయితే, విరుద్ధ ప్రయోజనాలు గంగూలీకి వర్తించే అవకాశం కనిపించటం లేదు. బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన గంగూలీ, ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్లో చేరాడు. దీంతో నేరుగా విరుద్ధ ప్రయోజనాలను దాదా దూరం పెట్టినట్టు చెప్పవచ్చు.