Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి రౌండ్లోనే పరాజయం
- సింధు, శ్రీకాంత్ శుభారంభం
- మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్
కౌలాలంపూర్ : ఇటీవల స్ఫూర్తిదాయక ప్రదర్శనతో మునుపటి ఫామ్ సాధించేలా కనిపించిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు మలేషియాలో మరో పరాభవం ఎదురైంది. అనారోగ్య కారణాలతో స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్లకు దూరమైన సైనా, తాజాగా కౌలాలంపూర్లో బరిలోకి దిగింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లోనే థారులాండ్ అమ్మాయి పొర్నపొవి చేతిలో పరాభవం చవిచూసింది. 22-20, 15-21, 10-21తో మూడు గేముల పోరులో వెనుకంజ వేసింది. మలేషియా ఓపెన్ నుంచి నిష్క్రమించింది. మహిళల సింగిల్స్లో మరో స్టార్ పి.వి సింధు శుభారంభం చేయగా, మెన్స్ సింగిల్స్ టైటిల్ ఫేవరెట్ కిదాంబి శ్రీకాంత్ రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. కొరియా అమ్మాయి సంగ్ జీ హ్యూన్తో సింధు నేడు తలపడనుండగా, థారులాండ్ కుర్రాడితో శ్రీకాంత్ పోటీపడనున్నాడు.
సైనా తడబాటు : పొర్నపవీతో మ్యాచ్లో సైనా తడబడింది. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. తొలి గేమ్లో 9-3, 15-11, 20-15తో ముందంజలో నిలిచినా ప్రత్యర్థికి అవకాశం ఇచ్చింది. 20-20తో సమవుజ్జీగా నిలిచిన పొర్నపవీ ఉత్కంఠ రేపింది. చివర్లో రెండు వరుస పాయింట్లతో సైనా గట్టెక్కింది. కానీ తర్వాతి గేముల్లో పొర్నపవీ మరింత గట్టిగా పోరాడింది. 11-10తో విరామ సమయానికి ఆధిక్యం సాధించి, 16-13, 18-15తో ముందంజ వేసి రెండో గేమ్ గెల్చుకున్నది. నిర్ణయాత్మక మూడో గేమ్లో సైనా అసలు పోరాటమే చేయలేదు. ఏకపక్షంగా సాగిన గేమ్ను పొర్నపవీ సొంతం చేసుకున్నది. సైనా నెహ్వాల్ తొలి రౌండ్ నుంచే నిష్క్రమించింది. మరో మ్యాచ్లో పి.వి సింధు 22-20, 21-12తో అయా ఒహొరి (జపాన్)పై వరుస గేముల్లో గెలుపొందింది. తొలి గేమ్ను టైబ్రేకర్లో నెగ్గినా, రెండో గేమ్ను ఏకపక్షంగా సొంతం చేసుకున్నది. మెన్స్ సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ 21-18, 21-16తో ముస్తాఫా (ఇండోనేషియా)పై అలవోక విజయం సాధించాడు. హెచ్.ఎస్ ప్రణరు తొలి రౌండ్ దాటలేదు. 21-12, 16-21, 14-21తో సిట్టికోమ్ (థారులాండ్) చేతిలో పోరాడి ఓడాడు. పురుషుల డబుల్స్లో మను అత్రి, సుమిత్ రెడ్డి జోడీ 16-21, 6-21తో ఏడో సీడ్ చైనా జంట ముందు తలొంచారు.