Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింధుకు భంగపాటు
- మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్
కౌలాలంపూర్ : మలేషియా ఓపెన్లో మరో భారత అగ్రశ్రేణి షట్లర్కు చుక్కెదురైంది. తొలి రౌండ్లో ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ నిష్క్రమించగా, రెండో రౌండ్లో ఒలింపిక్ రజత పతక విజేత పి.వి సింధు ఇంటి బాట పట్టింది. సైనా, సింధు నిష్క్రమణతో మహిళల సింగిల్స్లో భారత పోరాటానికి తెరపడింది. ఇండియా ఓపెన్ రన్నరప్ కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్లో టైటిల్ వేట కొనసాగిస్తున్నాడు. 21-11, 21-15తో థారులాండ్ షట్లర్పై వరుస గేముల్లో గెలుపొంది క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. 18-231, 7-21తో సింధు వరుస గేముల్లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నది. నేడు క్వార్టర్ఫైనల్లో చైనా దిగ్గజం చెన్ లాంగ్ (4)తో కిదాంబి శ్రీకాంత్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. నాల్గో సీడ్ చెన్లాంగ్ 5-1తో శ్రీకాంత్పై ముఖాముఖిలో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.
శ్రీకాంత్ అలవోకగా.. : పురుషుల సింగిల్స్ ఎనిమిదో సీడ్ కిదాంబి శ్రీకాంత్ అర గంటలోనే క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ఖోసిత్పై వరుస గేముల్లో సులువుగా గెలుపొందాడు. తొలి గేమ్లో 6-2, 11-7తో ముందంజలో నిలిచిన శ్రీకాంత్.. 14-9, 18-10తో ఏకపక్షంగా గెలుపొందాడు. రెండో గేమ్లో సైతం 11-5తో విరామ సమయానికి భారీ ఆధిక్యం సాధించాడు. 16-19, 20-15తో థారులాండ్ షట్లర్ను చిత్తు చేశాడు. మహిళల సింగిల్స్లో కొరియా స్టార్ సంగ్ జీ హ్యూన్ చేతిలో సింధు దారుణ ఓటమి చవిచూసింది. తొలి గేమ్లో 8-5, 11-0తో సింధు ముందంజ వేసినా.. 14-17, 16-19తో ద్వితీయార్థంలో తడబడింది. రెండో గేమ్లో 0-5తో వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయిన సింధు మళ్లీ కోలుకోలేదు. విరామ సమయానికి 6-11తో ఉన్న సింధు ద్వితీయార్థంలో కేవలం ఒక్క పాయింట్ మాత్రమే సాధించింది. 42 నిమిషాల్లోనే ఎటాకింగ్ ప్లేయర్ సింధుపై సంగ్ జీ హ్యూన్ విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్లో సిక్కి రెడ్డి, ప్రణవ్ జెర్రీ చొప్రా జంట పోరాడి ఓడింది. మలేషియా జోడీతో జరిగిన మూడు గేముల పోరులో 21-15, 17-21, 13-21తో ప్రణవ్, సిక్కి ఓటమిపాలయ్యారు.