Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మలేసియా ఓపెన్లో ముగిసిన భారత్ పోరు
కౌలాలంపూర్ : మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-బి750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల కథ ముగిసింది. పురుషుల సింగిల్స్లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించిన ఏకైక షట్లర్ కిదాంబి శ్రీకాంత్ శుక్రవారం జరిగిన మ్యాచ్లో పరాజయం పాలయ్యాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో శ్రీకాంత్ 18-21, 19-21 తేడాతో ఒలింపిక్ చాంపియన్, నాలుగో సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో ఓడాడు. సైనా నెహ్వాల్ తొలిరౌండ్లోనే వెనుదిరగగా... పివి సింధు రెండోరౌండ్లో వైదొలిగిన సంగతి తెలిసిందే. పురుషుల సింగిల్స్ విభాగంలోనూ భారత షట్లర్లందరూ నిష్క్రమించగా... ఏకైక షట్లర్ కిదాంబి క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. చెన్-లాంగ్తో రెండు సెట్లలోనూ పోటాపోటీగా ఆడిన కిదాంబి విజయానికి అవసరమైన పాయింట్లను సాధించే దశలో ఒత్తిడికిలోనై పరాజయం చవిచూశాడు. తొలి గేమ్ను మూడు పాయింట్ల తేడాతో కోల్పోయిన శ్రీకాంత్.. రెండో గేమ్ను రెండు పాయింట్ల తేడాతో వదులుకున్నాడు. ఫలితంగా టోర్నీ నుంచి శ్రీకాంత్ నిష్క్రమించాడు.