Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోహ్లీ జట్టుకు వరుసగా ఆరో ఓటమి
- శ్రేయాష్ అయ్యర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్
- ఢిల్లీ ఖాతాలో మూడో విజయం
బెంగళూర్ :డబుల్ హ్యాట్రిక్. వరుసగా ఆరో పరాజయం. కోహ్లి నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ పరాజయ దీన గాథ కొనసాగుతోంది. ఏం చేసినా, ఎవరితో ఆడినా.. ఆ జట్టు రాత మారటం లేదు. ఫలితంలో ఎటువంటి మార్పు ఉండటం లేదు. చిన్నస్వామిలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో బెంగళూర్ను చిత్తు చేసింది. శ్రేయాష్ అయ్యర్ (67) కెప్టెన్సీ ఇన్నింగ్స్తో 150 పరుగల ఛేదనలో ఢిల్లీని గట్టెక్కించాడు. ఈ ఓటమితో బెంగళూర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్టే!.
బెంగళూర్ కథ ముగిసింది!. ఐపీఎల్ 12 ప్లే ఆఫ్స్ రేసు నుంచి కోహ్లీ జట్టు నిష్క్రమించింది!. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన రాయల్ చాలెంజర్స్, ఇక చాలెంజ్ చేసేందుకు ఏమీ మిగల్లేదు. భారీ స్కోరు చేసినా, స్వల్ప స్కోరు బాదినా.. ఆ జట్టు ఓటముల్లో ఎటువంటి మార్పు ఉండటం లేదు. చిన్నస్వామిలో ఆదివారం జరిగిన మ్యాచ్లో బెంగళూర్పై ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ శ్రేయాష్ అయ్యర్ (67, 50 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీకి తోడు పృథ్వీ షా (28), ఇన్గ్రామ్ (22), రిషబ్ పంత్ (18) రాణించటంతో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే 150 పరుగుల ఛేదనను ఢిల్లీ సులువుగా పూర్తి చేసింది. అంతకుముందు విరాట్ కోహ్లి (41, 33 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు), మోయిన్ అలీ (32, 18 బంతుల్లో 1 ఫోర్ 3 సిక్స్లు) రాణించగా బెంగళూర్ 149 పరుగులు నమోదు చేసింది. నాలుగు వికెట్లు కూల్చిన ఢిల్లీ సీమర్ కగిసో రబాడ (4/21) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
అయ్యర్ అదరగొట్టాడు : పిచ్ నెమ్మదిగా స్పందించటంతో లక్ష్యం 150 అయినా, అంత సులువు కాదు. ఇన్నింగ్స్ మూడో బంతికే సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ (0) అవుటయ్యాడు. అదే ఓవర్లో కెప్టెన్ శ్రేయాష్ అయ్యర్ (67) సైతం నిష్క్రమించాల్సింది. వికెట్ కీపర్ పార్దీవ్ పటేల్ క్యాచ్ నేలపాలు చేయటంతో అయ్యర్ బతికిపోయాడు. కష్టసాధ్యమైన ఛేదనలో అయ్యర్ సైతం సున్నా పరుగులకే అవుటై ఉంటే, బెంగళూర్ కథ మరోలా ఉండేదే!. యువ ఓపెనర్ పృథ్వీ షా (28) సహజశైలిలో ఐదు ఫోర్లతో రెచ్చిపోయాడు. కెప్టెన్ అయ్యర్ ఆరంభంలో షాకు సహకారం అందించాడు. షా నిష్క్రమణ తర్వాత ఇన్గ్రామ్(22)తో కలిసి ఛేదనను ముందుకు తీసుకెళ్లాడు. అయ్యర్ రెండు కీలక భాగస్వామ్యాలతో ఢిల్లీ మ్యాచ్ను చేతుల్లోకి తీసుకున్నది. రిషబ్ పంత్ (18, 14 బంతుల్లో 2 ఫోర్లు) రెండు ఫోర్లతో చెలరేగినా, మరోసారి ముగించకుండానే నిష్క్రమించాడు. అయ్యర్, పంత్, మోరిస్ (0) వికెట్లతో ఢిల్లీ మరోసారి పతనానికి చేరువవుతోందా? అనిపించింది. కానీ అక్షర్ పటేల్ (4), తెవాటియ (1) బెంగళూర్ ఆశలను ఆవిరి చేశారు. మరో ఏడు బంతులు ఉండగానే ఢిల్లీ లక్ష్యాన్ని చేరుకున్నది. మూడో విజయం నమోదు చేసింది.
విరాట్ ఒక్కడే : తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూర్కు మంచి ఆరంభం లభించలేదు. పార్దీవ్ పటేల్ (9) రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి (41) బాధ్యతాయుత ఇన్నింగ్స్తో ఆర్సీబీని నిలబెట్టాడు. 18వ ఓవర్ వరకూ విరాట్ క్రీజులోనే నిలిచినా.. ధనాధన్ దూకుడు ప్రదర్శించలేకపోయాడు. డివిలియర్స్ (17), స్టోయినిస్ (15)లు నిరాశపరిచారు. చివర్లో మోయిన్ అలీ (32), అక్షదీప్ నాథ్ (19) వేగంగా పరుగులు చేశారు. చివరి ఓవర్లలో పరుగులు రాబట్టలేకపోయిన బెంగళూర్ 149 పరుగులకే చేయగల్గింది. ఢిల్లీ యువ సీమర్ కగిసో రబాడ (4/21) నిప్పులు చెరిగాడు. కోహ్లి, డివిలియర్స్ సహా అక్షదీప్, పవన్ నేగి (0) వికెట్లను నేలకూల్చాడు.
బెంగళూర్ ఇన్నింగ్స్ : పార్దీవ్ (సి) సందీప్ (బి) మోరీస్ 9, కోహ్లి (సి) అయ్యర్ (బి) రబాడ 41, డివిలియర్స్ (సి) ఇన్గ్రామ్ (బి) రబాడ 17, స్టోయినిస్ (సి) తెవాటియ (బి) అక్షర్ 15, అలీ (స్టంప్డ్) పంత్ (బి) సందీప్ 32, అక్షదీప్ (సి) పంత్ (బి) రబాడ 19, నేగి (సి) పంత్ (బి) రబాడ 0, సౌథి నాటౌట్ 0, సిరాజ్ (ఎల్బీ) మోరీస్ 1, చాహల్ నాటౌట్ 1, ఎక్స్ట్రాలు : 05, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 149.
వికెట్ల పతనం : 1-16, 2-40, 3-66, 4-103,5-133, 6-137, 7-138, 8-142.
బౌలింగ్ : ఇషాంత్ శర్మ 4-0-31-0, క్రిస్ మోరీస్ 4-0-28-2, రబాడ 4-0-21-4, అక్షర్ 4-0-22-1, సందీప్ 4-0-46-1.
ఢిల్లీ ఇన్నింగ్స్ : పృథ్వీ షా (సి) అక్షదీపÊ (బి) నేగి 28, ధావన్ (సి) నవదీప్ (బి) సౌథి 0, శ్రేయాష్ అయ్యర్ (సి) చాహల్ (బి)షైని 67, ఇన్గ్రామ్ (ఎల్బీ) అలీ 22, రిషబ్ పంత్ (సి) సౌథి (బి) సిరాజ్ 18, అక్షర్ పటేల్ నాటౌట్ 4, రాహుల్ తెవాటియ నాటౌట్ 1, ఎక్స్ట్రాలు : 12, మొత్తం : (18.5 ఓవర్లలో 6 వికెట్లకు) 152.
వికెట్ల పతనం: 1-1, 2-69, 3-108, 4-145, 5-145, 6-147.
బౌలింగ్ : సౌథి 2-0-24-1, షైని 4-0-24-2, చాహల్ 4-0-36-0, నేగి 3-0-27-1, సిరాజ్ 1.5-0-14-1, అలీ 4-0-22-1.