Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేలంలో కోట్లు దక్కించుకున్న కబడ్డీ ప్లేయర్స్
- ప్రొ కబడ్డీ 7 ఆటగాళ్ల వేలం
ముంబయి : ప్రొ కబడ్డీ వేలంలో దేశవాళీ ఆటగాళ్లు రూ. కోట్లు దక్కించుకున్నారు. తెలుగు టైటాన్స్ రూ.1.45 కోట్లు వెచ్చించి రైడర్ సిద్దార్థ్ దేశారును ఎంచుకున్నది. రూ. 1.20 కోట్లతో నితిన్ తోమర్ను పుణెరి పల్టన్ కైవసం చేసుకున్నది. ప్రొ కబడ్డీ సీజన్ 7 ఆటగాళ్ల వేలం సోమవారం ముంబయిలో జరిగింది. తొలి రోజు వేలంలోకి 79 మంది ఆటగాళ్లు వచ్చారు. 12 ప్రాంఛైజీలు రూ. 42.86 కోట్లు ఖర్చు చేశాయి. తెలుగు టైటాన్స్ రాహుల్ చౌదరిని వదులుకున్నది. రూ. 94 లక్షలతో తమిళ తలైవాస్ రాహుల్ను తీసుకున్నది. ప్రశాంత్ కె రాజ్ రూ. 77 లక్షలు (హర్యానా స్టీలర్స్), చంద్రన్ రంజిత్ రూ. 70 లక్షలు (దబంగ్ ఢిల్లీ), మోను గోయత్ రూ.93 లక్షలు (యూపీ యోధ), మహిందర్ సింగ్ రూ.80 లక్షలు (బెంగళూర్ బుల్స్), సురెందర్ నడా రూ.77 లక్షలు (పట్నా పైరేట్స్), పర్వేశ్ బైంస్వాల్ రూ. 75 లక్షలు (గుజరాత్) వేలంలో అధిక ధర దక్కించుకున్నారు.