Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : హాకీ ఇండియాకు కొత్త కోచ్ వచ్చాడు. 2018 మెన్స్ హాకీ వరల్డ్కప్లో భారత్ క్వార్టర్ఫైనల్స్కు చేరినా, పతకం రాలేదని స్వదేశీ కోచ్ హరెంద్రసింగ్పై హాకీ ఇండియా వేటు వేసింది. నాలుగు నెలలుగా కోచ్ లేకుండానే సాగుతున్న హాకీ ఇండియాకు ఆస్ట్రేలియాకు చెందిన గ్రాహమ్ రీడ్ కొత్త కోచ్గా ఎంపికయ్యాడు. ఇటీవల ప్రపంచకప్లో నెదర్లాండ్స్కు సహాయక కోచ్గా పనిచేసిన గ్రాహమ్, ఆ జట్టు రజతం నెగ్గటంలో కీలక పాత్ర పోషించాడు. 1992 బార్సిలోనా ఒలింపిక్స్లో సిల్వర్ సాధించిన ఆసీస్ జట్టులో రీడ్ సభ్యుడు. 1984, 1985, 1989, 1990లలో చాంపియన్స్ ట్రోఫీ సాధించిన కంగరూ జట్టులోనూ గ్రాహమ్ కీలక ఆటగాడు. అంతర్జాతీయ సర్క్యూ ట్లో గ్రాహమ్ అపార అనుభవం హాకీ ఇండియాను నడిపించేందుకు ఉపయోగపడతా యని హాకీ సమాఖ్య భావించింది. 2020 డిసెంబర్ వరకూ రీడ్ కాంట్రాక్టు ఉండగా, మెరుగైన ఫలితాలు సాధిస్తే 2022 ప్రపంచకప్ వరకూ అతడినే కొనసాగించే అవకాశం ఉంది. ' చీఫ్ కోచ్గా నాకు, జట్టులో ఆటగాళ్లకు నిలకడైన వాతావరణం కల్పించటమే కీలకమని' కొత్త కోచ్ రీడ్ వ్యాఖ్యానించాడు.