Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిరుడు మహిళల ఐపీఎల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఒక్కటే జరిగింది. ఆరంభ మ్యాచ్కు ముందు వాంఖడేలో ఆ మ్యాచ్ను నిర్వహించారు. ఈ ఏడాది మహిళల ఐపీఎల్ ఎగ్జిబిషన్ మ్యాచుల సంఖ్య నాలుగుకు పెరిగింది. మూడు జట్లు తలపడనుండే ఎగ్జిబిషన్ మ్యాచులకు విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూర్ ఆతిథ్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది భారత స్టార్స్కు తోడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ క్రికెటర్లు మాత్రమే పాల్గొన్నారు. ఈ ఏడాది శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా అమ్మాయిలు సైతం బరిలోకి దిగనున్నారు. నాలుగు మ్యాచుల్లో ఒక మ్యాచ్ సమయాన్ని రాత్రి 8 గంటలకు మార్పు చేయటం, మహిళల ఐపీఎల్ మ్యాచ్ ఆదరణ తీసుకొచ్చే అవకాశం ఉంది. లాజిస్టిక్ సమస్యలు తలెత్తకుండా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ సమయంలో మహిళల ఎగ్జిబిషన్ మ్యాచులు నిర్వహించనున్నారు. ప్లే ఆఫ్స్కు ముందు నాలుగు గంటల సమయంలో మహిళల ఐపీఎల్ జరుగనున్నది.