Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన టోర్నీకి సీనియర్ షట్లర్
- నేడు సింధు, సైనా, శ్రీకాంత్ పోరు
- సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్
సింగపూర్ : 2014 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత, సీనియర్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కొన్నేండ్లుగా ఫామ్ కోసం ఇబ్బంది పడుతున్నాడు. టైటిల్ రేసులో ముందు నిలిచిన దశ నంచి ప్రధాన టోర్నీ కోసం అర్హత మ్యాచులు ఆడే స్థితికి దిగజారాడు. నిలకడగా విఫలమవుతున్న కశ్యప్.. సతీమణి సైనా నెహ్వాల్కు కోచ్గా కొత్త కెరీర్ ఆరంభించినా, తనూ షటిల్ కోర్టులో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. తాజాగా సింగపూర్ ఓపెన్లో పారుపల్లి కశ్యప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచుల్లో కశ్యప్ వరుస విజయాలు సాధించాడు. ప్రధాన టోర్నీలోకి ప్రవేశించాడు. తొలి మ్యాచ్లో మలేషియా ఆటగాడు చెమ్ జున్ వీపై 21-5, 14-21, 21-17తో మూడు గేముల్లో గెలుపొందాడు. తర్వాతి మ్యాచ్లో 15-21, 21-16, 21-13తో ఇగరషి (జపాన్)పై సైతం మూడు గేముల పాటు పోరాడాడు. మహిళల సింగిల్స్ అర్హత రౌండ్లో ముగ్ధ మెప్పించింది. 16-21, 21-14, 21-15తో విజయం సాధించి, ప్రధాన టోర్నీలోకి అడుగుపెట్టింది.
నేడు స్టార్స్ పోరు : సింగపూర్ ఓపెన్లో నేడు భారత స్టార్స్ బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్, పి.వి సింధులు తొలి రౌండ్లో ఆడనున్నారు. ఇండోనేషియా అమ్మాయి అలిసెండ్రాతో సింధు తొలి మ్యాచ్లో పోటీపడనున్నది. ఇండోనేషియాకే చెందిన యెసెఫిన్తో సైనా నెహ్వాల్ ఢకొీట్టనున్నది. పురుషుల సింగిల్స్లో టాప్ సీడ్ కెంటో మొమొటా (జపాన్)తో బి. సాయిప్రణీత్ పోటీపడనుండగా, సితికామ్ (థారులాండ్)తో కిదాంబి శ్రీకాంత్ ఆడనున్నాడు.