Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింధు, సైనా, శ్రీకాంత్ ముందంజ
- సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్
సింగపూర్ : భారత షట్లర్లు శుభారంభం చేశారు. ఈ సీజన్ తొలి టైటిల్ వేటలో అగ్ర తారలు సైనా నెహ్వాల్, పి.వి సింధు సహా కిదాంబి శ్రీకాంత్లు సింగపూర్ ఓపెన్లో ముందంజ వేశారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచుల్లో అలవోక విజయాలు నమోదు చేశారు. సింధు 21-9, 21-7తో అలెసాండ్రాపై అలవోక విజయం సాధించగా, 21-16, 21-11తో యులియ యెసెఫిన్పై సైనా సులువుగా గెలుపొందింది. మెన్స్ సింగిల్స్లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ 21-17, 21-18తో సితికోమ్పై విజయం సాధించాడు.
చెమట పట్టకుండా.. : భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు చెమట పట్టకుండా సింగపూర్ ఓపెన్ రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. పి.వి సింధు అర గంటలోపే తొలి రౌండ్లో లానీ అలెసాండ్రా (ఇండోనేషియా)పై అతి సునాయస విజయం సాధించింది. తొలి గేమ్లో 2-2తో తర్వాత 11-4తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచిన సింధు.. 16-9, 21-9తో నెగ్గింది. రెండో గేమ్నూ 9-1, 16-3, 21-7తో ఏకపక్షంగా సొంతం చేసుకున్నది. నేడు రెండో రౌండ్లో డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్ఫెల్ట్తో సింధు తలపడనున్నది. సైనా నెహ్వాల్ 43 నిమిషాల్లోనే రెండో రౌండ్కు చేరుకున్నది. తొలి గేమ్లో 8-4, 11-9తో ముందంజ వేసిన సైనాకు 13-13, 15-15తో యులియ యెసెఫిన్ (ఇండోనేషియా) గట్టి పోటీనిచ్చింది. కానీ వరుసగా పాయింట్లు సాధించిన సైనా 21-16తో తొలి గేమ్ నెగ్గింది. రెండో గేమ్ను సైనా దూకుడుగా ఆరంభించింది. 11-5తో విరామ సమయానికి భారీ ఆధిక్యం సాధించి, 15-10, 21-11తో ధనాధన్ ముగింపునిచ్చింది. మలేషియా ఓపెన్ తొలి రౌండ్లోనే తనకు షాకిచ్చిన థారులాండ్ షట్లర్ చొచొవింగ్ పొర్నపవీతో సైనా నెహ్వాల్ రెండో రౌండ్లో ఢకొీట్టనున్నది. తొలి రౌండ్లో భారత వర్థమాన షట్లర్ ముగ్ధపై 21-6, 21-8తో పొర్నపవీ గెలుపొందింది. మెన్స్ సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్కు గట్టి పోటీ ఎదురైనా, తెలుగోడు సులువుగానే నెగ్గాడు. తొలి రౌండ్లో వరుసగా నాల్గు పాయింట్లతో 4-0తో శ్రీకాంత్పై సితికామ్ (థారులాండ్) పైచేయి సాధించాడు. వేగంగా పుంజుకున్న శ్రీకాంత్ 7-5తో ముందుకొచ్చాడు. 11-10తో విరామ సమయానికి ముందంజ వేశాడు. ద్వితీయార్థం నువ్వా నేనా అన్నట్టు సాగింది. 11-11 నుంచి 14-14 వరకూ ఆధిక్యం అటు ఇటు మారింది. 17-15తో ముందుకెళ్లిన శ్రీకాంత్ అదే జోరులో గేమ్ను ముగించాడు. రెండో గేమ్లో శ్రీకాంత్ గట్టి పోటీ ఎదుర్కొన్నాడు. విరామ సమయానికి 9-11తో వెనుకంజలో నిలిచాడు. సెకండ్ హాఫ్లో పుంజుకుని 14-13, 18-13తో ముందంజ వేశాడు. 19-18తో సితికామ్ రేసులోకి వచ్చినా, ఒత్తిడిలో వరుస పాయింట్లు నెగ్గి శ్రీకాంత్ పైచేయి సాధించాడు. వెటరన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ సైతం ముందంజ వేశాడు. 21-19, 21-14తో రాస్మస్ గెమ్కె (డెన్మార్క్)పై గెలుపొందాడు. బి. సాయిప్రణీత్ 21-19, 14-21, 20-22తో టాప్ సీడ్ కెంటో మొమోట (జపాన్)తో మూడు గేముల్లో పోరాడి ఓడాడు. తొలి గేమ్ నెగ్గిన సాయిప్రణీత్.. నిర్ణయాత్మక మూడో గేమ్ను టైబ్రేకర్లో కోల్పోయాడు. హెచ్.ఎస్ ప్రణరు 11-21, 21-16, 21-18తో బ్రైస్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. సమీర్ వర్మ 21-14, 21-6తో సుపయను (థారులాండ్)పై గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్ జెర్రీ చొప్రా, సిక్కి రెడ్డి జంట సహచర జోడీ ఎంఆర్ అర్జున్, మనీశలపై 21-18, 21-7తో గెలుపొందారు. సౌరభ్ వర్మ, అనుష్క పారిక్ జంట 12-21, 12-21తో ఓటమిపాలైంది. మెన్స్ డబుల్స్లో మను అత్రి, సుమీత్ రెడ్డిలు 13-21, 17-21తో నిరాశపరిచారు.