Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభిమానుల ప్రశంసలు
న్యూఢిల్లీ: ప్రపంచకప్ కోసం టీమిండియా జట్టును సోమవారం ప్రకటించనున్నారు. దీంతో అందరి దృష్టి నాలుగో స్థానంపైనే నెలకొంది. ఈ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న విషయంపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఐపీఎల్లో ఆటగాళ్ల ప్రదర్శనను చూసి ఈ స్థానాన్ని ఖరారు చేస్తారని తెలుస్తోంది. అయితే నాలుగో స్థానానికి ముంబయిపై చెలరేగి శతకం బాదిన పంజాబ్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ సరిపోతాడని పలువురు క్రీడాభిమానులు అంటున్నారు. బుధవారం ముంబయితో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ విజృంభించి తొలి శతకం నమోదు చేశాడు. అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడిపోయినా రాహుల్ ప్రదర్శనపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. రాహుల్ శతకం నమోదు చేసి సోమవారం ఎంపిక చేసే భారత జట్టులో తనకు స్థానం ఖాయమనే రీతిలో సందేశం పంపించాడు. టీమిండియాలో నాలుగో స్థానానికి రాహులే సరైన వ్యక్తి అని పలువురు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఐపీఎల్ ఈ సీజన్లో శతకం నమోదు చేసిన నాలుగో ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. సంజు శాంసన్, బెయిర్స్టో, డేవిడ్ వార్నర్ ఇప్పటి వరకూ సెంచరీలు నమోదు చేసిన విషయం తెలిసిందే.