Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సింగపూర్ : భారత బ్యాడ్మింటన్ స్టార్ ఆటగాళ్లు పివి సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్ళగా... పారుపల్లి కశ్యప్ రెండోరౌండ్లోనే పరాజయం చవిచూశాడు. గురువారం జరిగిన రెండోరౌండ్ పోటీల్లో పివి సింధు 21-13, 1-19 పాయింట్ల తేడాతో మియా బ్లిచ్ఫీల్డ్(థారులాండ్)పై సునాయాసంగా గెలిచింది. హోరాహోరీ సాగిన పోటీలో సైనా నెహ్వాల్ థారులాండ్కు చెందిన చో-ఛువాంగ్ను 21-16, 18-21, 21-19 పాయింట్ల తేడాతో ఓడించి క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇక పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్ 9-21, 21-15, 16-21 పాయింట్ల తేడాతో చైనా షట్లర్ చెన్-లాంగ్ చేతిలో పరాజయం చవిచూడగా... కిదాంబి శ్రీకాంత్ 21-12, 23-21తో హన్స్-క్రిస్టియన్పై గెలిచాడు.