Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్ రాయల్స్పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
జైపూర్: రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఉత్కంఠపోరులో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా మిచెల్ శాంట్నర్ సిక్స్ కొట్టి గెలిపించాడు. 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన చెన్నైని అంబటిరాయుడు (57, 47బంతుల్లో), ధోనీ(58, 43 బంతుల్లో) అర్ధశతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 95 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాక రాయుడు ఔటయ్యాడు. చివరి ఓవర్లో 18 పరుగులు చెయ్యాల్సి ఉండగా మూడో బంతికి ధోనీ ఔటయ్యాడు. ఈ సమయంలో ఇరు జట్లకూ విజయాకాశాలు ఉండగా చివరికి చెన్నైనే విజయం వరించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్లో భాగంగా సవాయి మాన్సింగ్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. చెన్నై బౌలర్ల దెబ్బకు రాజస్తాన్ 151 పరుగులు మాత్రమే చేయగల్గింది. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ మూడో ఓవర్లో తొలి వికెట్ను కోల్పోయింది. రాహుల్ చాహర్ వేసిన ఆ ఓవర్ ఐదో బంతికి రహానే(14) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. శార్థూల్ ఠాకూర్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన బట్లర్(23) ఆ తర్వాతి బంతికి భారీ షాట్కు ప్రయత్నించి రాయుడుకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక మిషెల్ సాట్నర్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతికి శాంసన్(6) ధృవ్ శోరేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొంత సమయానికే రాహుల్ త్రిపాఠి(10) జడేజా బౌలింగ్లో జాదవ్కు క్యాచ్ ఇచ్చి స్టీవ్ స్మిత్(15) జడేజా వేసిన 11వ ఓవర్ చివరి బంతికి రాయుడుకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. ఈ దశలో కష్టాల్లోపడ్డ జట్టుకు స్టోక్స్, పరాగ్ అండగా నిలిచేందుకు ప్రయత్నించారు. కానీ స్టోక్స్(28) దీపక్ చాహర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కొంత సమయా నికే పరాగ్(16) ఠాకూర్ బౌలింగ్లో ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చివర్లో జోఫ్రా ఆర్చర్(13), శ్రేయస్ గోపాల్(19) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. చెన్నై బౌలింగ్లో చాహర్, ఠాకూర్, జడేజా తలా రెండు, శాంట్నర్ ఒక వికెట్ తీశారు.