Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్ : రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్బంగా మైదానంలోకి ప్రవేశించి, అంపైర్లతో వాదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిపై మ్యాచ్ రిఫరీ మ్యాచ్ ఫీజులో కోత విధించాడు. కెప్టెన్గా కూల్ ధోని తొలిసారి ప్రశాంతత కోల్పోయాడు. లెవల్ 2.2 ప్రకారం తప్పును అంగీకరించిన మహి మ్యాచ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించినట్టు బీసీసీఐ పేర్కొన్నది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం జరిమానా ఆటగాళ్లు చెల్లంచరు, వారు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంఛైజీలే చెల్లిస్తాయి. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో స్టిఫెన్ ఫ్లెమింగ్, జోశ్ బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ' అంపైర్ల భిన్న నిర్ణయాలతో స్పష్టత కోసమే ధోని మైదానంలోకి వెళ్లాడు. అది తప్పా, ఒప్పా అని అందరూ చర్చిస్తారు. ఆ పని మహి కూడా చేయగలడు' అని చెన్నై కోచ్ ఫ్లెమింగ్ అన్నాడు. ' ఆట మధ్యలో మైదానంలోకి వచ్చి అంపైర్లతో వాదనకు దిగటం సరైనది కాదని అనుకుంటున్నాను' అని రాయల్స్ ఆటగాడు జోశ్ బట్లర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. పోస్ట్ మ్యాచ్ ఇంటర్య్వూలో వ్యాఖ్యాత మురళీ కార్తీక్ నో బాల్ వివాదంపై ధోనీని ప్రశ్నించకపోవటంపైనా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.