Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్లో సైనా, శ్రీకాంత్ ఓటమి
- సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్
సింగపూర్ : భారత బ్యాడ్మింటన్ అగ్రతార, తెలుగు తేజం పి.వి సింధు మరో టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సహచర షట్లర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్లు క్వార్టర్ఫైనల్లో పరాజయం పాలైనా.. సింధు ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. చైనా అమ్మాయిపై 21-13, 17-21, 21-14తో సింధు గెలుపొందింది. టాప్ సీడ్ కెంటో మోమోట (జపాన్) చేతిలో కిదాంబి శ్రీకాంత్ మూడు గేముల మ్యాచ్లో పోరాడి ఓడాడు. రెండో సీడ్ నొజొమి ఒకుహర (జపాన్) 21-8, 21-13తో సైనా నెహ్వాల్పై వరుస గేముల్లో నెగ్గింది. నేడు జరిగే సెమీ సమరంలో ఒకుహరతో సింధు ఫైనల్లో చోటు కోసం పోటీపడుతుంది.
సింధు పైచేయి : మహిళల సింగిల్స్లో చైనా షట్లర్ కారు యానన్పై సింధు పోరాడి నెగ్గింది. 59 నిమిషాల పాటు సాగిన మెగా వార్లో సింధు గెలుపొందింది. తొలి గేమ్లో 21-13తో నెగ్గిన సింధు.. రెండో గేమ్ను 17-21తో కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్లో విరామ సమయానికి 11-5తో సింధు భారీ ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలో చైనా అమ్మాయి పుంజుకునే ప్రయత్నం చేసినా, సింధు అవకాశం ఇవ్వలేదు. 15-9, 19-11తో సింధు గెలుపు ఖాయం చేసుకున్నది. మరో క్వార్టర్స్లో సైనా నెహ్వాల్ పోరాడకుండానే చేతులెత్తేసింది. 8-21, 13-21తో ఒకుహర ముందు తలొంచింది. మెన్స్ సింగిల్స్లో మూడు గేముల పాటు ఉత్కంఠ జరిగిన మ్యాచ్లో కిదాంబి శ్రీకాంత్ 18-21, 21-19, 9-21తో కెంటో మెమోట చేతిలో పరాజయం పాలయ్యాడు. సమీర్ వర్మ 10-21, 21-15, 15-21తో చైనీస్ తైపీ షట్లర్ చేతిలో ఓడాడు. మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్ జెర్రీ చొప్రా, సిక్కి రెడ్డి జంట 14-21, 16-21తో నిరాశపరిచింది.