Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధోని ప్రవర్తనపై సెహ్వాగ్
న్యూఢిల్లీ : రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో చెన్నై కెప్టెన్ ఎం.ఎస్ ధోని మైదానంలోకి అడుగుపెట్టి, అంపైర్లతో వాదనకు దిగటం పట్ల మాజీలు ఇప్పటికే విమర్శలు గుప్పించారు. మహీ సైతం మానవమాత్రుడేనని గంగూలీ వ్యాఖ్యానించగా, సెహ్వాగ్ ఓ అడుగు ముందుకేశాడు. ' ధోని తక్కువ శిక్షతో తప్పించుకున్నాడని అనిపిస్తోంది. అతడిపై కనీసం 2-3 మ్యాచుల నిషేధం విధించాల్సింది. ఎందుకంటే ఈ రోజు ధోని చేస్తే, రేపు మరో కెప్టెన్ చేస్తాడు. ఇక అంపైర్లకు విలువ ఏముంటుంది? అని వీరూ ప్రశ్నించాడు. ధోనీని భారత సారథిగా ఎన్నడూ ఇంత ఆగ్రహంతో చూడలేదని, సూపర్ కింగ్స్ తరఫున అతడు కొంత భావోద్వేగానికి గురవుతున్నట్టు అనిపిస్తోందని సెహ్వాగ్ అన్నాడు. ' ధోని ఇది భారత్ కోసం చేసి ఉంటే సంతోషించేవాడిని. కానీ భారత కెప్టెన్గా అతడిని ఎన్నడూ ఇలా చూడలేదు. చెన్నై తరఫున అతడు భావోద్వేగంతో ఉన్నట్టు తోస్తోందని' వీరూ పేర్కొన్నాడు.