Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాయుడు పరిస్థితిపై గంభీర్
న్యూఢిల్లీ : 2019 ప్రపంచకప్ జట్టు వచ్చేసింది. 33 ఏండ్ల తెలుగు తేజం అంబటి రాయుడును విస్మరించారు. పంత్ను కాదని కార్తీక్ను ఎంపిక చేయటంపై, రాయుడిని పక్కనపెట్టడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకోలేని అంబటి రాయుడు మంగళవారం ఆసక్తికర ట్వీట్ చేశాడు. ' వరల్డ్కప్ను చూసేందుకు ఇప్పుడే కొత్త 3డీ అద్దాలు ఆర్డర్ చేశాను' అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు. వరల్డ్కప్ జట్టుకు ఎంపిక కాని రాయుడి పరిస్థితి ఊహించగలనని గంభీర్ అన్నాడు. ' 33 ఏండ్ల వయసు. వరల్డ్ క్రికెట్లో 47కు పైగా సగటు ఉండీ వరల్డ్కప్కు ఎంపిక కాకపోవటం బాధాకరం. 2007 వరల్డ్కప్కు ఎంపిక కానప్పుడు నా గుండె చెరువైంది. ఇప్పుడు రాయుడు పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించగలను. రాయుడిని పక్కనపెట్టడంపై చర్చ జరగాలని కోరుకుంటున్నాను' అని గంభీర్ వ్యాఖ్యానించాడు.