Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీఫ్ కోచ్ రవిశాస్త్రి
ముంబయి : 2019 ప్రపంచకప్ జట్టులో కొన్ని స్థానాల ఎంపికపై దుమారం రేగుతున్న నేపథ్యంలో భారత జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేసులో ఉన్న ఆటగాళ్ల మనసు గాయపరచకుండా, 16 మందితో కూడిన జట్టును ఎంపిక చేయాలని కోరుకున్నట్టు రవిశాస్త్రి వెల్లడించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం 15 మంది జట్టునే ఎంపిక చేయాలి. ' సెలక్షన్ ప్రక్రియలో నేను జోక్యం చేసుకోను. నా అభిప్రాయాలు ఏమైనా.. కెప్టెన్కు తెలియజేస్తాను. 15 మంది జట్టునే ఎంపిక చేసినప్పుడు ఇతర ఆటగాళ్ల మనసు గాయపడుతుంది. అది దురదృష్టకరం. అందుకే నేను 16 మంది జట్టుకు ఓటేస్తాను. సుదీర్ఘ టోర్నీలో 16 మందితో కూడిన జట్టు మేలని ఐసీసీకి చెప్పాం. కానీ వారు 15 మందికే పరిమితి విధించారు' అని శాస్త్రి పేర్కొన్నాడు. ఆ ఒకరిద్దరు ఆటగాళ్లు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. ఇదెంతో ఫన్నీ గేమ్. గాయాలు అవుతుంటాయి. ఎప్పుడు పిలుపు వస్తుందనే ఎవరికీ తెలియదని శాస్త్రి అన్నాడు. సొంతగడ్డపై ఆడుతున్న సానుకూలతతో ఆతిథ్య ఇంగ్లాండ్ వరల్డ్కప్ ఫేవరెట్గా బరిలోకి దిగబోతుందని శాస్త్రి అభిప్రాయపడ్డాడు.