Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్మెడలిస్ట్ మను బాకరే
న్యూఢిల్లీ : రామ మందిరం, సర్జికల్ స్ట్రైక్స్ వంటి వాటికి పట్టణ ప్రాంత మహిళలు ప్రాధాన్యత ఇవ్వవచ్చుగానీ, గ్రామీణ మహిళలకు కుటుంబాల్లో, సామాజిక జీవనంలో స్వేచ్ఛ అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమని ప్రముఖ షూటర్, కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత మను దాకరే అన్నారు. 2018 కామన్ వెల్త్ క్రీడల్లో షూటింగ్లో బంగారు పతకాన్ని సాధించిన ఆమె, అదే ఏడాది జరిగిన అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్లో రెండు స్వర్ణాలను సాధించి ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. ప్రస్తుత ఎన్నికల్లో మహిళల సమస్యలను ఏ పార్టీ పట్టించుకోవటంలేదని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత తక్కువగా ఉందనీ, సామాజిక స్వేచ్ఛ లభిస్తేనే, మహిళలు రాజకీయాలపై చర్చించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని అన్నారు. మహిళలు పురోగతి సాధించేందుకు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలనీ, అందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. అయితే 18 ఏండ్లు నిండని కారణంగా మను ఈ ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నారు.