Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పృథ్వీషాకు డిన్నర్ ఇచ్చిన సచిన్
న్యూఢిల్లీ : పృథ్వీషా తన అభిమాన క్రికెటర్తో కలిసిన ఉన్న ఫొటో చూసుకొని మురిసిపోతున్నాడు. మాస్టర్ బ్లాస్టర్గా పేరుపొందిన సచిన్ను క్రికెటర్లు ఫాలోఅవుతుంటారు. అలాంటి సచినే.. పృథ్వీషాను డిన్నర్కు ఆహ్వానం పలికారు. బుధవారం ఢిల్లీలోని ఓ హౌటల్లో పృథ్వీషాకు సచిన్ డిన్నర్ ఇచ్చాడు. అయితే, సచిన్తో కలసి డిన్నర్ చేసిన ఫొటోను అభిమానులతో పంచుకునేందుకు పృథ్వీ తన ట్విటర్ ఖాతాలో దానిని పోస్టు చేశాడు. మంచి డిన్నర్ ఇచ్చినందుకు థాంక్యూ సచిన్ సర్. మిమ్మల్ని కలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది అంటూ రాసుకొచ్చాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న పృథ్వీ ఎనిమిది మ్యాచుల్లో 187 పరుగులు చేశాడు. అందులో 99 పరుగుల భారీ ఇన్నింగ్స్ కూడా ఉన్నది.