Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్స్
బ్యాంకాక్ : ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్స్ తొలి రోజు భారత బాక్సర్లు శుభారంభం చేశారు. కామన్వెల్త్ క్రీడల రజత పతక విజేత సతీశ్ కుమార్, ప్రపంచ చాంపియన్షిప్స్ సిల్వర్ మెడలిస్ట్ సోనియా చాహల్లు క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. 91 కేజీల విభాగంలో ఇరాన్ బాక్సర్ ఇమన్పై సతీశ్ కుమార్ గెలుపొందగా, 57 కేజీల మహిళల విభాగంలో సోనియా చాహల్ వియాత్నం బాక్సర్ను మట్టికరిపించింది. నేషనల్ చాంపియన్ దీపక్ (49 కేజీలు), రోహిత్ (64 కేజీలు) ప్రీ క్వార్టర్స్లో కాలుమోపారు. ఆశీష్ (69 కేజీలు) సైతం ప్రీ క్వార్టర్స్కు చేరుకున్నాడు. ఈ టోర్నీలో బంగారు పతకాలు సాధించిన బాక్సర్లకు ప్రపంచ చాంపియన్షిప్స్లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కుతుంది. ఆసియా చాంపియన్షిప్స్లో తొలిసారి స్లో మోషన్లో వీడియోలు చిత్రీకరిస్తున్నారు. బౌట్ అవగానే ఏ జట్టు అభ్యంతరం వ్యక్తం చేసినా వీడియో రిఫరల్తో తీర్పు చెబుతారు. సమీక్ష నెగ్గకపోతే రూ.70000 జరిమాన విధిస్తారు.