Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసక్తిరేపుతోన్న ఎమ్మెస్కే వ్యాఖ్యలు శ్రీనివాస్ దాస్ మంతటి
బలహీనమైన సెలక్షన్ కమిటీ. చీఫ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లిలకు ఎదురు చెప్పగలే ధైర్యం లేని సెలక్షన్ కమిటీ. ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీపై తరచుగా వినిపించే విమర్శలు. ప్రసాద్ సహా అతడి సహచరులు గగన్ ఖోడ, దేవాంగ్ గాంధీ, జతిన్ పరంజ్పె, శరన్దీప్ సింగ్లకు అంతర్జాతీయ క్రికెట్లో తగినంత అనుభవం లేదు. ప్రసాద్ మూడు టెస్టులు, 17 వన్డేలే ఆడగా.. మిగతా సభ్యులు జాతీయ జట్టుకు 3-4 మ్యాచులు ఆడిన వారే. గగన్, జతిన్లకు టెస్టు అనుభవమే లేదు. దేవాంగ్, సింగ్లు వరుసగా 3, 4 టెస్టులు ఆడారు. గగన్ రెండు వన్డేలు, జతిన్ నాలుగు వన్డేల్లో ప్రాతినిథ్యం వహించారు. అదే గత చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ 29 టెస్టు, 45 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించాడు. అంతర్జాతీయ పోటీలో తగినంత అనుభవం లేని సెలక్షన్ కమిటీపై జట్టు మేనేజ్మెంట్ ఆధిపత్యం ఉందని చెప్పేందుకు, గత జట్టు ఎంపికలు నిదర్శనంగా నిలిచాయి. కానీ ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం ఏప్రిల్ 15న చీఫ్ సెలక్టర్ జట్టును ప్రకటించిన తర్వాత చేసిన వ్యాఖ్యలు.. విమర్శలకు భిన్నంగా కనిపిస్తున్నాయి. జట్టు ఎంపికలోనూ సెలక్షన్ కమిటీ సిఫారసు చేసిన ఆటగాళ్లతోనే జట్టు మేనేజ్మెంట్ సంతృప్తి పడిందని చెప్పడానికి కెప్టెన్ కోహ్లి వ్యాఖ్యలు నిదర్శనం!. జట్టును ప్రకటించినప్పుడు, ఎవరిని ఎందుకు తీసుకున్నామో చెప్పటం ఆనవాయితీ కానీ, తుది జట్టు ఇలా ఉండబోతుందని సెలక్టర్లు ఏనాడూ పేర్కొన్న దాఖలాలు లేవు. ప్రపంచకప్ జట్టు విషయంలో తుది జట్టు కూర్పుపై సెలక్షన్ కమిటీ ఛైర్మన్ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఇంగ్లాండ్లో జరిగే వరల్డ్కప్కు ఇక్కడ ముంబయి సెలక్షన్ కమిటీ సమావేశంలోనే తుది జట్టుపై తేల్చేశారా? అనే సందేహం కలుగుతోంది.
ప్రసాద్ చెప్పాడిలా.. : 15 మంది ప్రపంచకప్ జట్టులో ముగ్గురు తుది జట్టులో ఉండబోరు అని చీఫ్ సెలక్టరే స్వయంగా వెల్లడించాడు. కెఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజాలు బెంచ్ ఆటగాళ్లని తేల్చేశాడు. ' కెఎల్ రాహుల్ను మూడో ఓపెనర్గానే ఎంపిక చేశాం. మిడిల్ ఆర్డర్ స్థానాలకు అతడు పోటీ పడడు. ఒకవేళ మిడిల్లో అన్ని ప్రయత్నాలు విఫలమైతేనే రాహుల్ను పరిగణనలోకి తీసుకుంటారు. ఎం.ఎస్ ధోని గాయంతో ఫిట్నెస్ కోల్పోయినప్పుడు మాత్రమే పంత్, కార్తీక్ను ఆడించాలి. అప్పుడు వికెట్ కీపింగ్ నైపుణ్యం కీలకం. అందుకే దినేశ్ కార్తీక్ను ఎంపిక చేశాం. ఇంగ్లాండ్ వేసవిలో మరీ మందకోడి పిచ్లు ఎదురైతే రవీంద్ర జడేజా ఉపయోగపడతాడు. ఆ అంశమే జడేజాను వరల్డ్కప్ జట్టులో నిలిపింది' అని జట్టును ప్రకటిస్తూ ప్రసాద్ పేర్కొన్నాడు. ధోని రాణించినా, విఫలమైనా అతడు జట్టులో కొనసాగుతాడు. గాయపడిన సందర్భంలోనే కార్తీక్ జట్టులోకి వస్తాడు. లేదంటే అన్ని మ్యాచులకు బెంచ్కు పరిమితం కాకతప్పదు. కెఎల్ రాహుల్ మూడో ఓపెనర్ మాత్రమే. ఇద్దరు ఓపెనర్లలో ఎవరైనా గాయపడితేనే అతడికి తుది జట్టులో చోటు. నం.4 స్థానంలో విజరు శంకర్కు తొలి ప్రాధాన్యం. అతడికే ఆరంభంలో అవకాశాలు. అతడు విఫలమైతేనే కార్తీక్ లేదా కేదార్ల వైపు చూపు అని ప్రసాద్ చెప్పకనే చెప్పాడు. 15 మంది జట్టులో తుది జట్టులో చోటు కోసం పోటీ పడుతున్న వారు 13 మందే. బ్యాటింగ్ లైనప్లో రోహిత్, ధావన్, కోహ్లి, విజరు శంకర్, ఎం.ఎస్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యలు తుది జట్టులో ఖరారు. పిచ్ పరిస్థితులను బట్టి ముగ్గురు సీమర్లు, ఓ స్పిన్నర్ లేదా ఇద్దరు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతోనా అనేది కెప్టెన్ నిర్ణయించుకోవాలి. ప్రసాద్ వ్యాఖ్యలను బట్టి.. యుజ్వెంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్, జశ్ప్రీత్ బుమ్రాలలో ఒకరు బెంచ్కు పరిమితం అవుతారు. ప్రపంచకప్ జట్టును ప్రకటించే సమయంలో సెలక్షన్ కమిటీ చైర్మన్ తుది జట్టునూ వెల్లడించాడని చెప్పవచ్చు.
ఎక్కడ.. ఎవరు.. అక్కడే తేలుస్తా! : చీఫ్ సెలక్టర్ పనిలో పనిగా తుది జట్టు కూర్పుపై తేల్చాశాడని భావించాడో ఏమో కానీ కెప్టెన్ విరాట్ కోహ్లి పొజిషన్లపై స్పందించాడు. నం.4లో విజరు ఆడతాడని ప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తూనే అది ఇంగ్లాండ్లోనే నిర్ణయిస్తామని పేర్కొన్నాడు. ' నం.4పై విజరు ఎందుకు అనే విషయంలో సెలక్షన్ కమిటీ మూడు ధృక్కోణాల ప్రయోజనంతో ఏకీభవించాం. అందుకే విజరు స్థానంపై అంగీకరించాం. కానీ ఎవరు ఏ స్థానంలో ఆడాలనే విషయం ప్రపంచకప్లోనే నిర్ణయిస్తామని' ఓ ఇంటర్వ్యూలో కోహ్లి పేర్కొన్నాడు.