Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాండ్య, రాహుల్పై అంబుడ్స్మన్
ముంబయి : మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యలపై బీసీసీఐ అంబుడ్స్మన్ జస్టిస్ డికె జైన్ రూ. 20 లక్షల జరిమానా విధించారు. ' జెంటిల్మెన్ గేమ్లో క్రికెటర్లను యువత ఆదర్శంగా తీసుకుంటోంది. మైదానంలోనే కాదు, బయటా మీ ప్రవర్తన అంతే స్ఫూర్తిదాయకంగా ఉండాలి' అని అంబుడ్స్మన్ పేర్కొన్నాడు. విధి నిర్వహణలో కోల్పోయిన పారా మిలటరీ దళాల పది మంది కానిస్టేబుల్స్ భార్యలకు తలా రూ. 1 లక్ష చొప్పున జమ చేయటం, బధిరుల క్రికెట్ సంఘానికి రూ. 10 లక్షలు విరాళంగా అందించాలని అంబుడ్స్మన్ ఆదేశించారు. జరిమానపై సీఓఏ వైఖరిని సీఈఓ రాహుల్ జోహ్రిని అడుగగా.. గతంలో విధించిన ఐదు వన్డేల నిషేధంతో కోల్పోయిన మ్యాచ్ ఫీజునే బోర్డు వారికి గరిష్ట జరిమానాగా భావిస్తున్నట్టు తెలిపారు. వన్డే మ్యాచ్కు రూ. 7 లక్షల చొప్పున ఆటగాళ్లు మ్యాచ్ ఫీజు పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ జరిమానాను నాలుగు వారాల్లోగా జమ చేయాలని అంబుడ్స్మన్ ఆదేశించారు. పాండ్య, రాహుల్ ఇద్దరూ భారత ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే.
మరో అఫిడవిట్ ఇవ్వండి! : విరుద్ధ ప్రయోజనాల అంశంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని బీసీసీఐ అంబుడ్స్మన్ డికె జైన్ మరో అఫిడవిట్ దాఖలు చేయాలని కోరాడు. గంగూలీ క్రికెట్ సలహా సంఘం సభ్యుడిగా కొనసాగుతున్నా, రెండేండ్లకు ఒకసారి సమావేశమయ్యే కమిటీ కోసం అతడు ఇతర కాంట్రాక్టులను వదులుకోవాల్సిన పని లేదని అంబుడ్స్మన్ భావించినట్టు తెలుస్తోంది. ఇదేమంత బలమైన విరుద్ధ ప్రయోజనం కాదని, కొత్తగా గంగూలీ నుంచి మరో అఫిడవిట్ కోరింది. సన్రైజర్స్ మెంటర్గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ గతంలో టామ్ మూడీ భారత చీఫ్ కోచ్కు ఇంటర్వ్యూకు వచ్చినప్పుడు వీవీఎస్ సమావేశం నుంచి తప్పుకున్న ఉదంతాన్ని అంబుడ్స్మన్ గుర్తు చేసినట్టు సమాచారం.