Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : ఐపిఎల్లో ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న చెన్నై కెప్టెన్ తాజాగా మరో రెండు రికార్డులను తన పేర వేసుకున్నాడు. ఐపీఎల్లో 200 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగానితోపాటు ఓ ఫ్రాంచేజీ కెప్టెన్గా 4,000 పరుగులను పూర్తిచేసిన ఆటగాడిగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. సిక్సర్లలో ధోనీ కంటే ముందు క్రిస్గేల్(323), ఏబీ డివిలియర్స్(204) ఉన్నారు. ధోని 203 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ధోనీ తర్వాత రోహిత్ శర్మ(190), సురేశ్రైనా(190), విరాట్ కోహ్లీ(186) ఉన్నారు.
ఆటకు వయసుతో సంబంధం లేదు...
ఆటకు వయసుతో సంబంధం లేదని, ఆడే ఇష్టం ఉంటే సత్తా చాటొచ్చని ఈ జార్జండ్ డైనమైట్ ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించాడు. కానీ ఆదివారం రాయల్చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ధోని ప్రదర్శన అద్భుతమైతే.. అతను కొట్టిన ఓ భారీ షాట్ అత్యద్భుతం. ఉమేశ్ యాదవ్ వేసిన చివరి ఓవర్లో ధోని కొట్టిన ఆ షాట్కు మైదానంలో ఆటగాళ్లు, ప్రేక్షకులతో పాటు టివిల ముందు కూర్చున్న ప్రేక్షకుల కళ్లు సైతం జిగేల్మన్నాయి. ఉమేశ్ యాదవ్ వేసిన ఆఖరి ఓవర్లో ధోని వరుసగా ఐదు బంతుల్లో 4, 6, 6, 2, 6తో 24 పరుగులు పిండుకున్నాడు. అయితే ఇందులో కొట్టిన రెండో బంతి సిక్స్ అయితే ఏకంగా 112 మీటర్ల దూరంలో స్టేడియం బయటపడింది. ప్రస్తుతం ఈ సిక్స్కు సంబంధించిన వీడియో.. 'ఇప్పుడు చెప్పండ్రా.. ధోని హేటర్స్' అనే వాట్సాప్ స్టేటస్లతో నెట్టింట హల్చల్ చేస్తోంది.
నేనే ముగించాలని...
'ఛేదనలో బ్యాట్స్మెన్పై ఒత్తిడి ఉంటుంది. కొత్తగా వచ్చిన బ్యాట్స్మన్ వచ్చీరావడంతోనే బౌండరీలు బాదడం అంత సులభం కాదు. బ్రావో అప్పటికి కేవలం మూడు బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. ఆ సమయయంలో బ్రావో పెద్ద షాట్లు ఆడతాడని ఎవరూ అనుకోరు. అందుకే ఆ బాధ్యత నా భుజాలపై వేసుకోవాలని నిర్ణయించుకున్నా' అని ధోని పేర్కొన్నాడు. ధోని నిర్ణయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా సమర్థించాడు. 'ధోనీ ఏది చేసినా లెక్క ప్రకారం చేస్తాడు.
బ్రేవో బలమైన బ్యాట్స్మన్ కావచ్చు. కానీ క్రీజులోకి అడుగుపెట్టగానే బౌండరీలు బాదడం ఏ బ్యాట్స్మెన్కు కుదిరే పని కాదు. అందుకే ఆ బాధ్యతను ధోనీ తీసుకున్నాడు. ఇలాంటి ఉత్కంఠ మ్యాచుల్లో ధోని ఎన్నో విజయాలు అందించాడు. కాబట్టి సింగిల్స్ విషయంలో ధోనిని మేం ప్రశ్నించుకోదలచుకోలేదు' అని ఫ్లెమింగ్ వివరించాడు.