Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షెడ్యూల్ ప్రకటించిన సీఏ
మెల్బోర్న్ : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మధ్య వివాదానికి కారణమైన మూడు వన్డేల సిరీస్ యథావిథిగా జరుగబోతుంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన షెడ్యూల్లో భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ను 2020 జనవరిలోనే అని తేల్చింది. ఆసీస్ వేసవిలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ తర్వాత, కివీస్తోనే వన్డే సిరీస్ ఆడాలని ప్రసారదారు ఆస్ట్రేలియా బోర్డుపై ఒత్తిడి తెచ్చింది. ఈ మేరకు బీసీసీఐతో సీఏ సంప్రదింపులు జరిపినా, భారత బోర్డు అంగీకరించలేదు. అమ్మాయిల ఐపీఎల్లో పాల్గొనాల్సిన ముగ్గురు ప్లేయర్స్ ఎలిసీ పెర్రీ, మెగ్ లానింగ్, అలిసా హీలేలకు అనుమతి నిరాకరించి, సీఏ వివాదానికి చోటిచ్చింది.