Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరల్డ్కప్ జట్టుపై కపిల్ దేవ్
న్యూఢిల్లీ : 2019 ప్రపంచకప్కు భారత జట్టు కూర్పు బాగుందని దిగ్గజ క్రికెటర్, మాజీ భారత కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. 1983 ప్రపంచకప్ విజయంతో భారత్ను క్రికెట్ దేశంగా మార్చిన కపిల్దేవ్.. ఎం.ఎస్ ధోని, విరాట్ కోహ్లి కాంబినేషన్ 2019 వరల్డ్కప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ' భారత జట్టులో గొప్ప కాంబినేషన్ కనిపిస్తుంది. యువకులు, అనుభవజ్ఞులతో కూడిన బృందం. ఓ రకంగా అత్యంత అనుభవం ఉన్న జట్టు. నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లు.. ధోని, కోహ్లి' మన కాంబినేషన్ బాగుందని కపిల్ అన్నాడు. ఇంగ్లీష్ పరిస్థితుల్లో బంతి స్వింగ్ అవుతుంది. నలుగురు సీమర్ల ఎంపిక సరైనది. షమి, బుమ్రాలు వేగంగా బంతులేయగలరు. నాకు తెలిసి భారత్ కచ్చితంగా సెమీఫైనల్స్కు చేరుతుంది. అక్కడ్నుంచి వ్యక్తిగత ప్రదర్శనలు, జట్టు కూర్పు, కొంత అదృష్టం కలిసి రావటంపై ఆధారపడుతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్లు టాప్-3 జట్లు. న్యూజిలాండ్, వెస్టిండీస్లు అద్భుతాల కోసం ఎదురుచూస్తున్నాయి. 'ధోని, రోహిత్, ధావన్, కోహ్లి, షమి వంటి సీనియర్లు.. పాండ్య, కుల్దీప్, బుమ్రా వంటి యువకులు భారత్ను సమతూకమైన జట్టుగా చేస్తున్నారు. నం.4 గురించి అందరూ మాట్లాడుతున్నారు. నా దృష్టిలో టీ20 క్రికెట్ వచ్చాక ఓపెనర్ ఎవరు? నం.4 ఎవరనేది చెప్పటం కష్టం. 2011 వరల్డ్కప్లో యువరాజ్ సింగ్ను కాదని ధోని ముందుకొచ్చాడు. ఈ రోజుల్లో నం.4లో ఎవరైనా ఆడవచ్చు' అని కపిల్ దేవ్ తేల్చాడు.