Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిషబ్ పంత్కు పృథ్వీ షా కితాబు
విశాఖపట్నం : మ్యాచులు ముగించటంలో యువ క్రికెటర్లలో అతడే హీరో అని మరో యువ సంచలనం అభిప్రాయపడ్డాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో ఎలిమినేటర్లో యువ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ 21 బంతుల్లో 49 పరుగులు బాదాడు. 2 ఫోర్లు, 5 సిక్సర్లతో వీర విహారం చేసిన పంత్పై సహచర బ్యాట్స్మన్ పృథ్వీ షా ప్రశంసలు కురిపించాడు. 'టీ20 మ్యాచుల్లో ఎనలేని ఒత్తిడి ఉంటుంది. మేం గెలవాలని నేను ప్రార్థన చేస్తున్నా. పంత్ తెలివైన ఇన్నింగ్స్ ఆడాడు. యువ క్రికెటర్లలో పంత్ అత్యుత్తమ ఫినీషర్ అని చెప్పగలను. పంత్ ఎప్పుడూ అవకాశాలను సృష్టించగలడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు కానీ, చివర్లో వికెట్ కోల్పోయాడు' అని పృథ్వీ షా అన్నాడు. పవర్ ప్లేలో వీలైనన్ని బౌండరీలు బాదే బాధ్యత తీసుకున్న పృథ్వీ షా, జట్టు ప్రణాళిక కోసం వికెట్ను సైతం లెక్క చేయటం లేదు. సన్రైజర్స్ షా 38 బంతుల్లో 56 పరుగులు చేసి గెలుపు బాటలు వేసిన సంగతి తెలిసిందే.