Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిషబ్ పంత్పై వీవీఎస్ వ్యాఖ్య
హైదరాబాద్: సన్రైజర్స్ హైద రాబాద్పై ఊచకోత ఇన్నింగ్స్తో ఢిల్లీ క్యాపిటల్స్కు మెరుపు విజయాన్ని కట్టబెట్టిన యువ బ్యాట్స్మన్ రిషబ్ పంత్పై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. సన్రైజర్స్ హైదరాబాద్ సలహాదారు, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం పంత్ను ప్రశింసిచేవారి జాబితాలో చేరిపోయాడు. 2019 వన్డే వరల్డ్కప్కు పంత్ ఎంపిక కాకపోయినా, భారత క్రికెట్ భవిష్యత్ అతడే అనేందుకు ఎటువంటి సందేహం లేదని ఓ ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో లక్ష్మణ్ రాసుకొచ్చాడు. 21 బంతుల్లో 49 పరుగులు చేసిన పంత్ హైదరాబాద్ నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. 2 ఫోర్లు, 5 సిక్సర్లతో వీర విహారం చేశాడు. ' రిషబ్ పంత్ భారత క్రికెట్ భవిష్యత్. అది స్పష్టం. ముగింపులో వికెట్ పారేసుకుని నిరాశపరిచినా, పంత్ పరిణితి చూసి తరించేందుకు ముగింపు లేదు. బసిల్ తంపీ ఓవర్లో పంత్ వీరంగం అతడి సత్తా ఏంటో చూపించింది. పంత్ ప్రతాపానికి ప్రత్యర్థి శిబిరంలో ఉండటం బాధాకరమే కానీ, బౌలర్లపై యువ హీరో ఎదురుదాడి చూసేందుకు మచ్చటేసింది' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో మరో యువ ఆటగాడు పృథ్వీ షాపైనా వీవీఎస్ పొగడ్తలు గుప్పించాడు. ' పృథ్వీ షా ప్రతిభావంతుడు. అతడి భయ మెరుగుని క్రికెట్కు ముగ్దుడినయ్యాను. క్యాచౌట్ ప్రమాదం నుంచి బయటపడినా, ఏమాత్రం దూకుడు తగ్గించలేదు' అని లక్ష్మన్ వ్యాఖ్యానించాడు.