Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధోని, రోహిత్ కెప్టెన్సీపై టెండూల్కర్
హైదరాబాద్ : ప్రపంచ క్రికెట్లో ప్రత్యేక కెప్టెన్గా ఎం.ఎస్ ధోని తిరుగులేని ముద్ర వేసుకోగా.. ఐపీఎల్ సహా జాతీయ జట్టు తరఫున విజయాలు సాధించిన రోహిత్ శర్మ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. మ్యాచ్ పరిస్థితులను అర్ధం చేసుకునే విలక్షణత ధోని, రోహిత్ శర్మలను ప్రత్యేక సారథులుగా నిలుపుతోందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. ' ధోని ఎంతో కాలంగా చూస్తున్నాం. అతడి సారథ్య శైలి మంచి డాక్యుమెంటరీ. తొలి బంతి నుంచే మ్యాచ్ పరిస్థితులను చదువుతూ, వ్యూహం రచించే లక్షణం ధోనిలో కనిపిస్తోంది. తనలోనూ ఆ ప్రత్యేకత ఉందని రోహిత్ శర్మ నిరూపించుకుంటున్నాడు. ఐపీఎల్ విజయాలే కాదు, జాతీయ జట్టు తాత్కాలిక సారథిగానూ రోహిత్ నమ్మశక్యం కాని విజయాలు అందుకున్నాడు' అని సచిన్ పేర్కొన్నాడు.