Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజేతకు ట్రోఫీ ప్రదానంపై వాదన
- వెనక్కి తగ్గిన డయాన ఎదుల్జీ
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ 12 టైటిల్ వేటలో ఓ వైపు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఉత్కంఠ పోరులో నిమగమయ్యాయి. టైటిల్ ఎవరి వశమో తేలేందుకు ఆఖరి బంతి వరకూ ఆగాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, మరోవైపు విజేతకు టైటిల్ ప్రదానం చేసేదెవరనే విషయమై బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, పాలకుల కమిటీ సభ్యురాలు డయాన ఎదుల్జీ వాగ్వాదంలో నిమగమయ్యారు. పాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రారు సహా సభ్యుడు లెఫ్టినెంట్ కల్నల్ రవి తోగ్డె జోక్యంతో ఐపీఎల్ బహుమతుల ప్రదాన ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. లేదంటే సీజన్కు వివాదంతో ముగింపు పలకాల్సి వచ్చేది.
జైపూర్లో జరిగిన మహిళల టీ20 చాలెంజ్ ఫైనల్స్కు హాజరైన సీఓఏ సభ్యురాలు విజేతకు ట్రోఫీని బహుకరించారు. ఐపీఎల్12 ఫైనల్స్కు సైతం ఎదుల్జీ హాజరయ్యారు. సీఓఏ చైర్మన్ వినోద్ రారు హైదరాబాద్ ఫైనల్స్కు రాలేదు. మహిళల విజేతకు ట్రోఫీని అందించాను, కాబట్టి ఇక్కడా నేనే విజేతకు ట్రోఫీని అందిస్తానని డయాన ఎదుల్జీ వెల్లడించారు. కార్యదర్శి అమితాబ్ చౌదరి పంపిన బహుమతి ప్రదానోత్సవం ప్రోటోకాల్ ఈమెయిల్ను బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సికె ఖన్నా ఆమెకు చూపించారు. అయినప్పటికీ, ఆమె ట్రోఫీ అందివ్వటంపై వెనక్కి తగ్గలేదు. సంప్రదాయం ప్రకారం, బీసీసీఐ అధ్యక్షుడే ట్రోఫీ ఇవ్వాలని సహచర సీవోఏ సభ్యుడు లెఫ్టినెంట్ కల్నల్ రవి తోగ్డె సైతం అభిప్రాయపడ్డాడు. దీంతో ఎదుల్జీ వెనక్కి తగ్గంది. చైర్మన్ వినోద్ రారు సైతం ప్రోటాకాల్ను అనుసరించి కార్యక్రమం జరపాలని సూచించారు. పాలకుల కమిటీ ఛైర్మన్ రారుతో ఎన్నో అంశాల్లో విభేదించిన ఎదుల్జీపై ఇటీవల అమ్మాయిల జాతీయ జట్టులో వివాదాలకు కారణమైందనే విమర్శలున్నాయి.